మొన్నటివరకు నెల్లూరు అంటే టిడిపికి పెద్దగా పట్టు లేని జిల్లా..కానీ ఇప్పుడు నెల్లూరు అంటే టిడిపికి కలిసొచ్చే జిల్లా అన్నట్లు ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టిడిపి చావు దెబ్బతింది. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. దీంతో టిడిపి పని అయిపోయిందనే పరిస్తితి. కానీ అలాంటి పరిస్తితి నుంచి టిడిపి అనూహ్యంగా పుంజుకుంది. ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..టిడిపి నేతలు దూకుడుగా పనిచేయడం కలిసొచ్చింది.
ఇదే క్రమంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు..మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డి టిడిపిలోకి రావడంతో బలం పెరిగింది. అటు నారా లోకేష్ పాదయాత్ర పెద్ద ప్లస్. దీంతో ఈ సారి జిల్లాలో టిడిపి భారీగానే సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. తాజాగా నెల్లూరు సిటీ అభ్యర్ధిగా మాజీ మంత్రి నారాయణని ఫిక్స్ చేశారు. అక్కడ ఇప్పటివరకు ఇంచార్జ్ గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నారాయణని అభ్యర్ధిగా ఫిక్స్ చేయడంతో నెల్లూరులో టిడిపి అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయ్యారు. నెల్లూరు సిటీలో నారాయణ, నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరిలో కురుగండ్ల రామకృష్ణ, సూళ్ళూరుపేటలో పరసా వెంకట రత్నం, గూడూరులో పాశం సునీల్ కుమార్, కోవూరులో పొలంరెడ్డి దినేష్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. ఇక కావలిలో కావ్య కృష్ణారెడ్డి, సుబ్బానాయుడు పోటీ పడుతున్నారు. అటు ఉదయగిరి సీటులో మేకపాటి, బొల్లినేని వెంకటరామరావు, కాకర్ల సురేశ్ ఉన్నారు..వీరిలో సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇక నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరి, వెంకటగిరి, కావలి సీట్లలో టిడిపి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కోవూరులో టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ ఆనం, సోమిరెడ్డి లాంటి బలమైన నేతలు ఉండటం వల్ల ఆత్మకూరు, సర్వేపల్లిలో కూడా సీన్ మారే ఛాన్స్ ఉంది