ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంతజిల్లా..బాబు సొంత జిల్లా అంటే ఇక్కడ టిడిపికి హవా ఉండాలి..కానీ అలా ఉండదు. ఇక్కడ వైసీపీ జోరు కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవానే ఉంది. గత ఎన్నికల్లో అయితే జిల్లాలో 14 సీట్లు ఉంటే..వైసీపీ 13 సీట్లు గెలుచుకుంది. టిడిపికి ఒక కుప్పం సీటు వచ్చింది. అయితే ఈ సారి సొంత జిల్లాలో సత్తా చాటాలని బాబు చూస్తున్నారు. కానీ కుప్పంతో సహ 14 సీట్లు గెలుచుకోవాలని వైసీపీ చూస్తుంది.
ప్రస్తుతం చిత్తూరులో రాజకీయం మారిపోయింది..అక్కడ వైసీపీకి ధీటుగా టిడిపి ఉంది. కాకపోతే కాస్త వైసీపీకే ఆధిక్యం ఉంది. కానీ టిడిపి కొన్ని సీట్లలో ఆధిక్యంలోకి వచ్చింది. కుప్పం, నగరి, పలమనేరు, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి లాంటి సీట్లలో టిడిపికి బలం కనిపిస్తుంది. మిగిలిన సీట్లలో వైసీపీ బలంగానే ఉంది. ముఖ్యంగా రిజర్వడ్ సీట్లలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సత్యవేడు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు సీట్లలో వైసీపీకే లీడ్ ఉంది.
ఇక ఈ స్థానాల్లో సత్తా చాటాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వీటిల్లో ఒక్క సీటు గెలవలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక మొన్నటివరకు ఈ సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేయలేదు. కానీ ఇటీవల అభ్యర్ధులని రెడీ చేశారు. సత్యవేడుకు డాక్టర్ హెలెన్, గంగాధర నెల్లూరుకు డాక్టర్ థామ్సను నియమించారు. థామ్సను తొలుత చిత్తూరు లోక్సభ స్థానానికి అభ్యర్థిగా పెడదామనుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ స్థానానికి మార్చారు. ఇటు చాలాకాలంగా పూతలపట్టు స్థానం ఖాళీగా ఉంటుంది.
గత ఎన్నికల్లో ఇక్కడ లలితకుమారి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆమె టిడిపిని వీడారు. అక్కడ నుంచి ఇంచార్జ్ పెట్టలేదు. కానీ తాజాగా పూతలపట్టు స్థానానికి తిరుపతిలో పనిచేస్తున్న పాత్రికేయుడు మురళీమోహన్ను ఎంపిక చేశారు. దీంతో పూతలపట్టులో టిడిపికి కాస్త ఊపు వచ్చింది. ఇక వీరు ఎఫెక్టివ్ గా పనిచేస్తే గెలుపు సాధ్యం…లేదంటే మళ్ళీ మూడు పోతాయి