కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశుని సన్నిధి. ప్రతి హిందు తప్పక దర్శించాలని కోరుకునే పుణ్యక్షేత్రం ఏడుకొండల పై వెలసిన తిరుపతి వెంకటేశ్వర స్వామి కోవెల. స్వామిని దర్శించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి నడక మార్గం, వాహనాలు వెళ్లే దారి. ఈ మార్గాలు పూర్వం నుంచి ఉన్నాయి. ఏ సమయంలోనైనా భక్తులు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ మార్గాలలో వెళ్లి స్వామివారిని దర్శించి తరించేవారు.
కరోనా కాలంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని రోజులు స్వామివారి గుడికి మార్గాలు మూసి ఉంచటం వల్ల వన్యప్రాణులు యదేచ్చగా తిరుగురులలో సంచరించటం ప్రారంభించాయి. ప్రజల అలికిడి వాహనాల శబ్దం వినిపిస్తే వన్యప్రాణులు దూరంగా వెళ్లిపోతాయి కానీ కరోనా సమయంలో నిశ్శబ్దమైన వాతావరణం లో పచ్చని ప్రకృతిలో వన్యప్రాణులన్నీ యదేచ్చగా స్వాతంత్రంగా తిరగడం ప్రారంభించాయి. కరోనా తర్వాత స్వామివారి దర్శనం పునరుద్ధరించిన తర్వాత నుంచి భక్తులకు ఏదో ఒక అడవి జంతువు కనిపించటం పరిపాటిగా మారింది. శేషాచలం అడవులలో పులుల సంఖ్య ఎక్కువ. ఇటీవలే చిరుత దాడిలో ఓ చిన్నారి మరణించింది.
ఈ ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు. వాటిలో భాగంగా నడిచి వెళ్లే ప్రతిభక్తునికి ఒక చేతి కర్ర ఇస్తామని , భక్తులందరూ కలిసి గుంపులుగా వెళ్లాలని వీరికి కావలసిన సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే కర్రకు పులులు ఆగుతాయనే విమర్శలు వస్తున్నాయి. టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ట్రోల్స్ నడుస్తున్నాయి.
అటు తిరుమలకు వచ్చే భక్తులు..చేతి కర్రకు బదులుగా నడకమార్గానికి కంచ ఏర్పాటు చేస్తే ఏ అడవి జంతువు తమ పైకి రావని విన్నవించుకుంటున్నారు. కంచె ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని టిటిడి వారు చెప్పడానికి కూడా కుదరదు ఎందుకంటే దేశంలోని అన్ని దేవాలయాల కంటే తిరుపతి వెంకటేశ్వరని ఆదాయం చాలా ఎక్కువ. స్వామివారికి భక్తులు చెల్లించే కానుకల నుంచి కొంత మొత్తంతో కంచె ఏర్పాటు చేయడం టీటీడీ దేవస్థానం వారికి గొప్ప విషయం ఏమీ కాదు. భక్తులపై అడవి జంతువుల దాడి జరగకుండా ఉండడానికి స్వామివారిని భక్తులు నిర్భయంగా దర్శించుకోవడానికి టిటిడి దేవస్థానం వారు కంచ ఏర్పాటు చేస్తే భక్తులంతా ఏడుకొండల వాడిని దర్శించి తరిస్తారు. భక్తుల విన్నపాన్ని మన్నించి టీటీడీ పాలకమండలి కంచేను ఏర్పాటు చేస్తారా లేక కర్రలతోనే సరి పెడతారా వేచి చూడాల్సిందే….!
ReplyReply allForward |