తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తుంటారు గాని..ఆ విమర్శల్లో ఏ మాత్రం వాస్తవం లేదనే చెప్పాలి. అన్నీ పార్టీలకు టిడిపిలో ఆదరణ ఉంటుంది. కానీ కమ్మ అనే ముద్ర వేసి గత ఎన్నికల్లో లబ్ది పొందిన వైసీపీ..అధికారంలోకి వచ్చాక రెడ్డి వర్గానికి ఏ స్థాయిలో పెద్ద పీఠ వేసిందో చెప్పాల్సిన పని లేదు. ఇక కమ్మ వర్గం సగం ఓట్లు వైసీపీకే పడ్డాయి.
ఇప్పటికీ కొంత వరకు కమ్మవర్గం వైసీపీకే మద్ధతు ఉంది. అందుకే టిడిపి అంటే కమ్మ పార్టీ అనేది లేదు. ఒకవేళ అదే నిజమైతే కమ్మ వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి గెలవాలి. కానీ అలా గెలవడం లేదు. ముఖ్యంగా కమ్మ వర్గం ఓట్లు అత్యధికంగా కందుకూరు నియోజకవర్గంలో టిడిపి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయింది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో గెలిచింది. మళ్ళీ అక్కడ గెలవలేదు. అసలు టిడిపి అక్కడ గెలిచిందే రెండుసార్లు 1994, 1999 ఎన్నికల్లోనే.
2004 నుంచి టిడిపికి గెలుపు దక్కలేదు. వరుసగా ఓడిపోతూ వస్తుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. 2014లో వైసీపీ నుంచి పోతుల రామారావు గెలిచారు..ఆయన టిడిపిలోకి వచ్చారు. 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇలా కందుకూరులో టిడిపికి కలిసి రావడం లేదు. కానీ వరుస ఓటములుతో టిడిపికి కాస్త సానుభూతి ఉంది. ఈ సారి పార్టీకి గెలుపు అవకాశాలు మెరుగు పడ్డాయి.
కాకపోతే అభ్యర్ధి ఎవరనేది క్లారిటీ లేదు. ముగ్గురు నేతలు అక్కడ ఉన్నారు. దివి శివరాం, పోతుల రామారావు..ప్రస్తుత ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు…ఈ ముగ్గురులో సీటు ఎవరికి దక్కుతుందో చెప్పలేం. ఎవరికి దక్కిన అంతా కలిసి పనిచేస్తే టిడిపికి ప్లస్ లేదంటే..మళ్ళీ కందుకూరు దక్కే ఛాన్స్ లేదు