ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ సారి టిడిపి ఎక్కువ సీట్లు గెలవడమే టార్గెట్ గా చంద్రబాబు కష్టపడుతున్నారు. తన సొంత జిల్లాలోనే టిడిపి చవుడెబ్బ తినడం..మరీ దారుణమైన విషయం..అందుకే ఈ సారి వైసీపీకి చెక్ పెట్టి చిత్తూరుపై టిడిపి జెండా ఎగరవేయాలని బాబు చూస్తున్నారు. ఈక్రమంలో ప్రతి నియోజకవర్గంలో టిడిపి నేతలు దూకుడుగా పనిచేసే గెలుపు దిశగా వెళ్ళేలా నేతలకు దిశానిర్దేశం చేశారు.
అయితే కొన్ని సీట్లలో టిడిపి బలపడింది..కానీ కొన్ని సీట్లలో టిడిపి వెనుకబడింది. ఇక తంబళ్లపల్లెలో కూడా టిడిపి ఇంకా వెనుకబడే ఉందని సర్వేల్లో తేలింది. తంబళ్ళపల్లె లో టిడిపి అయిదుసార్లు గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. దాదాపు 47 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దీనికి కారణం టిడిపి మాజీ ఎమ్మెల్యే శంకర్ పై వ్యతిరేకత. ఇక ఓడిపోయాక శంకర్ నియోజకవర్గంలో అడ్రెస్ లేరు.
తర్వాత కార్యకతలు కొత్త ఇంచార్జ్ని పెట్టాలని డిమాండ్ చేస్తున్న టైమ్ లో శంకర్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబుని బ్రతిమలాడుకున్నారు. ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ సరిగ్గా పనిచేయకపోతే పక్కన పెట్టేస్తానని అన్నారు.
దీంతో శంకర్ అప్పటినుంచి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటున్నారు. టిడిపిని బలోపేతం చేశారు. కానీ ఇంకా బలపడాలి. పెద్దిరెడ్డికే ఇంకా లీడ్ కనిపిస్తుంది. పెద్దిరెడ్డిపై వ్యతిరేకత ఉంది..అభివృద్ధి చేయడం లేదు..కానీ అక్కడ రెడ్డి వర్గం ప్రభావం వల్ల వైసీపీకే లీడ్ ఉంది.
ఇంకా శంకర్ కష్టపడాలి..అప్పుడే టిడిపికి ప్లస్. అలా కాకుండా శంకర్ని మార్చి వేరే నాయకుడుని పెడితే పరిస్తితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు..2009లో ఈయన టిడిపి నుంచి గెలిచారు..2014లో వైసీపీలోకి వెళ్ళి ఓడిపోయరు. 2019లో సీటు రాలేదు. దీంతో న్యూట్రల్ గా ఉంటున్నారు. ఒకవేళ ఈయన్ని టిడిపిలోకి తీసుకొచ్చి సీటు ఇస్తే గట్టి పోటీ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి బాబు తంబళ్ళపల్లె సీటు ఏం చేస్తారో.