ఏపీ మంత్రుల్లో కాస్త మీడియా ముందుకొచ్చి..ప్రత్యర్ధులని తిట్టే మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్ కూడా ఒకరు. నిజానికి ఈయనకు అనేక శాఖలు ఉన్నాయి. ప్రధానంగా ఐటీ, ఇండస్ట్రీ శాఖలు ఉన్నాయి. మరి ఈ శాఖల పరంగా ప్రెస్ మీట్లు పెట్టి..రాష్ట్రానికి ఈ కంపెనీలు వస్తున్నాయి..పెట్టుబడులు వస్తున్నాయి..ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నామనే అంశాలని గుడివాడ ఎప్పుడు పెద్దగా మీడియా ముందు చెప్పరు. ఎంతసేపు చంద్రబాబు, పవన్ లపై విమర్శలు చేస్తారు.
ఇక కంపెనీల గురించి అడిగితే కోడి గుడ్డు కథలు చెబుతారు. అలా గుడివాడ ఒక మంత్రి అని జనాలకు తెలిసింది. అయితే ఇలా చేయడం వల్ల రాజకీయంగా గుడివాడకే పెద్ద మైనస్ అవుతుందనే సంగతి పట్టించుకున్నట్లు లేరు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి..అధికార బలం తో ఏమైనా అయిపోతుందనే ధీమాతో ఉన్నారు. ఒక్కసారి అధికారం కోల్పోతే ఏం మిగలదు. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో గుడివాడ గెలుపుపైనే డౌట్ అని సర్వేలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో జగన్ గాలిలో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదృష్టం కొద్ది మంత్రి పదవి దక్కింది. పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ కేవలం ప్రతిపక్షాలని తిట్టడం, జగన్ కు భజన చేయడం వల్ల విలువ ఉండదు. ఇప్పుడు గుడివాడ పరిస్తితి అదే అయింది. వైసీపీ వాళ్ళు తప్ప..మిగతా వారంతా గుడివాడ అంటే ఏదో కామెడీ అయినట్లు అయింది.
ఇక మంత్రిగా అమర్నాథ్..అనకాపల్లి నియోజకవర్గానికి చేసిందేమి లేదనే విమర్శలు ఉన్నాయి.ఈ పరిస్తితులు అమర్నాథ్ కు బాగా మైనస్ అవుతున్నాయి. గత ఎన్నికల్లో అంటే జగన్ గాలిలో గెలిచారు. ఈ సారి అది కూడా ఉండదు. పైగా టిడిపి, జనసేన కలిస్తే అనకాపల్లిలో అమర్నాథ్ గెలుపు గగనమే.