తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండి కూడా ఓడిపోతున్న స్థానాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రత్యర్ధి పార్టీ బలంగా ఉండటం వల్ల టిడిపి ఓడిపోవడం లేదు..టిడిపిలో అంతర్గత పోరు వల్ల ఓడిపోతుంది. గత రెండు ఎన్నికల్లో అదే జరుగుతూ వస్తుంది. మొదట్లో ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది. 2009లో చివరిగా గెలిచింది.
2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. అయితే సరైన అభ్యర్ధిని పెట్టక ఓడిపోతుందా? లేదా ఆ అభ్యర్ధి ఓ వర్గం వారు సహకరించకపోవడం వల్ల? ఓడిపోతుందా? అంటే రెండు కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు..2014 ముందు టిడిపిలోకి వచ్చారు. యాదవ వర్గానికి చెందిన ఈయనకు ఆ వర్గంలో పట్టు ఉంది. అదే నూజివీడులో కలిసొస్తుందని అనుకున్నారు. కానీ నూజివీడులో రాజకీయాలని ప్రభావితం చేసే కమ్మ వర్గం..ముద్దరబోయినకు పూర్తిగా సహకరించలేదు.
దీంతో 2014లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక ముద్దరబోయిన కాస్త ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తే పరిస్తితి వేరుగా ఉండేది. అలా చేయకుండా 2019 ఎన్నికల ముందు మళ్ళీ వచ్చి సీటు అడిగారు. అప్పటికి బాబు సీటు ఇవ్వలేననే చెప్పేశారు. కానీ బ్రతిమాలడి సీటు తెచ్చుకున్నారు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. కమ్మ వర్గం సహకరించలేదు. మళ్ళీ ఓడిపోయారు.
ఇప్పుడు కూడా ముద్దరబోయిన ఇంచార్జ్ గా ఉన్నారు. ఈ సారి ముందు నుంచి కాస్త కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే కొందరు కమ్మ నేతలు కూడా సీటు ఆశిస్తున్నారు. దీంతో సీటు విషయంలో క్లారిటీ లేదు. మళ్ళీ దాదాపు ముద్దరబోయినకే సీటు ఇస్తారనే ప్రచారం ఉంది. కాకపోతే టిడిపి నేతలు కలిసి పనిచేస్తే గెలుస్తారు…లేదంటే మళ్ళీ నూజివీడుని గెలిచ్చుకోవడం కష్టమే