టీడీపీ అధినేత చంద్రబాబు తెలివిగా కొన్ని సీట్లలో అభ్యర్ధుల విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు..అలాగే కొన్ని స్థానాల్లో బలమైన నేతలని ఇంచార్జ్లుగా పెట్టలేదు. ఎప్పుడైతే జనసేనతో పొత్తు అనే ప్రచారం వచ్చిందో అప్పటినుంచి బాబు ఓ వ్యూహంతో ముందుకొస్తున్నారు. జనసేనతో పొత్తు ఊహించి కొన్ని సీట్లలో బలమైన ఇంచార్జ్ లని పెట్టలేదు. అంటే పొత్తు ఉంటే ఆ సీట్లు జనసేనకు ఇవ్వాలనేది బాబు ప్లాన్.
ఇదే క్రమంలో రామచంద్రాపురం సీటు కూడా అలాగే జనసేనకు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. గతంలో ఇక్కడ టిడిపి నుంచి తోట త్రిమూర్తులు పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన వైసీపీలోకి వెళ్లారు. దీంతో రామచంద్రాపురంలో టిడిపికి బలమైన నాయకుడు లేరు. ఈ క్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యంని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన యాక్టివ్ గానే పనిచేయలేదు. దీంతో అక్కడ టిడిపికి అనుకున్న విధంగా బలం పెరగలేదు. అదే సమయంలో జనసేన దూకుడుగా పనిచేస్తూ బలం పెంచుకుంది.
పైగా ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ. దీని బట్టి చూస్తే రామచంద్రాపురం సీటు జనసేనకు కేటాయిస్తారని అర్ధమవుతుంది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల ఈయన గెలిచారు. ఈ సారి టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే చెల్లుబోయినకు రిస్క్ ఎక్కువ ఉంటుంది.
ఒకవేళ జనసేనకు సీటు ఇస్తే..టిడిపి ఓట్లు ఎంతవరకు జనసేనకు పడతాయనేది చూడాలి. టిడిపి ఓట్లు జనసేనకు పూర్తిగా పడితేనే గెలుపు సాధ్యమవుతుంది. చూడాలి మరి రామచంద్రాపురంలో ఈ సారి ఎవరిది పై చేయి అవుతుందో