వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వంపై మరోసారి సమీక్షా సమావేశం పెట్టి..పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు. ఈ అక్టోబర్ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని..నెక్స్ట్ ఏ మాత్రం డౌట్ లేకుండా సీటు ఉండదని చెప్పేశారు. అయితే ఇప్పటికే జగన్ గడపగడప విషయంలో పలుమార్లు ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు.
కానీ ఎమ్మెల్యేలు కొందరు గడపగడపకు పెద్దగా వెళ్ళడం లేదు..ఎక్కడకక్కడ నిరసనలు ఎదురు కావడంతో చిక్కులు వస్తున్నాయి. గడపగడపకు వెళ్ళి కేవలం పథకాలు ద్వారా ఇన్ని డబ్బులు వచ్చాయని ప్రజలకు చెబుతున్నారు తప్ప..ప్రజా సమస్యలు వినడం గాని, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం గాని లేదు. దీంతో ప్రజల్లో అసంతృప్తి ఎక్కువై ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొంతమంది ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కొంతమంది అలాగే తిరుగుతున్నారు.
ఇక ఎవరైతే ఎక్కువగా గడపగడపకు వెళ్ళడం లేదో వారికి జగన్ తాజాగా క్లాస్ ఇచ్చారు. దాదాపు 18 మంది గడపగడపకు వెళ్ళడం లేదని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని, సుమారు 45 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, అక్టోబర్ లోగా మెరుగు పర్చుకోకపోతే సీటు ఇవ్వనని అంటున్నారు. అంటే పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇస్తే మళ్ళీ గెలవరనేది జగన్ అభిప్రాయం.. అభిప్రాయం ఏముంది అదే నిజం.
కాకపోతే ఇక్కడొక మెలిక ఉంది. ఎవరు గెలిచిన జగన్ బొమ్మతోనే గెలిచారని చెబుతున్నారు. అలాగే పథకాలు ఇచ్చేది జగన్..కింది స్థాయిలో వాలంటీర్లు అంతా చూసుకుంటున్నారు. మరి ఎమ్మెల్యేలు చేసేది ఏమి లేదు. అలాంటప్పుడు వాళ్ళ పనితీరుతో సంబంధం ఏమి ఉంది. జగన్ బొమ్మతోనే ఎవరైనా గెలవాలి. అలాంటప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు నిలబడిన గెలుస్తారు. అలా జరగలేదంటే జగన్ బొమ్మ పనిచేయట్లేదనే అనుకోవాలి. మరి ఈ సారి జగన్ బొమ్మ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.