ఎక్కడైనా అధికారంలో ఉండేవారు ప్రజలకు సేవ చేయాలి…వారి సమస్యలని తెలుసుకుని పరిష్కరించాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. కానీ ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అలాంటివి చేయడం లేదనే విమర్శలు ఎదురుకుంటుంది. కేవలం అప్పులు తెచ్చి ప్రజలకు పథకాల పేరుతో డబ్బులు పంచుతుంది. మళ్ళీ ఆ డబ్బులని పన్నుల రూపంలో వెనక్కి తీసుకుంటుంది. ఇంకా అంతే..వైసీపీ చేసేదేమీ లేదు.
ఇక మంత్రులు ఎందుకు ఉన్నారు? వారు చేస్తున్నది ఏంటి అంటే..వారు చంద్రబాబు, పవన్లని తిట్టడానికి, జగన్కు భజన చేయడానికి అన్నట్లు పరిస్తితి ఉంది. అందుకే చాలామంది మంత్రులు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలుస్తుంది. అనకాపల్లి నుంచి తొలిసారి గెలిచి రెండో విడతలో మంత్రి పదవి కొట్టేసిన గుడివాడ అమర్నాథ్. తీవ్ర వ్యతిరేకతని ఎదుకుంటున్నారని తెలిసింది. ఐటీ, పరిశ్రమలు..అబ్బో ఇంకా చాలా శాఖలు ఈయన వద్ద ఉన్నాయి. కానీ ఒక్క పనిచేసేది లేదు..పైగా గుడ్డు స్టోరీలు చెబుతారు..లేదా బాబు, పవన్లని తిడతారు. అందుకే ఈయనపై వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తుంది.
ఇక సొంత నియోజకవర్గం అనకాపల్లిలో కూడా చేసిన అభివృద్ధి ఏమి లేదని విమర్శలు వస్తున్నాయి. అక్కడ టిడిపి-జనసేన కలిస్తే గుడివాడ గెలుపు దాదాపు కష్టమే అని సర్వేలు తేల్చేసాయి. ఇక మరో మంత్రి బూడి ముత్యాలనాయుడు. పాపం విచిత్రం ఏంటంటే..ఈయన మంత్రి అనే విషయం చాలామందికి తెలియదు అని చెప్పవచ్చు. అంటే ఆయన పనితీరు అలా ఉందని చెప్పవచ్చు. ఈయనకు సొంత స్థానం మాడుగులలో అనుకూల అవకాశాలు లేవు. అక్కడ సొంత వారసుడుతోనే తలనొప్పి ఉంది. దీంతో బూడి కూడా నెక్స్ట్ గెలవడం కష్టమని అంటున్నారు.