నారా లోకేష్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుగా కుమారుడిగా ప్రపంచానికి పరిచయమైన నారా లోకేష్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
పప్పు అని గేలి చేసిన వారితోనే నాయకుడు అంటే ఇలానే ఉండాలి అని అనిపించుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా వచ్చిన లోకేష్ మంత్రిగా తన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చారని చెప్పవచ్చు.
ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లకుండానే గెలిచారు అని అందరూ అంటుంటే దానికి సమాధానంగా తాను ప్రజలతో మమేక మవ్వగలనని నిరూపించడానికి యువ గళం పాదయాత్రను చేపట్టారు .ఏసీలో ఉండేవాడు నడుస్తాడా నడవగలడా అన్న వైసిపి నేతలు విమర్శలు తప్పి కొడుతూ 200 రోజులు తన పాదయాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేశాడు.
నీరసంతో నిస్సత్తువుగా ఉన్న టిడిపికి తన పాదయాత్ర తో జీవసత్వాలు తీసుకువచ్చాడు. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టిడిపి లేదు అని అందరూ అంటుంటే అది అబద్దం అని నిరూపిస్తూ నారా లోకేష్ తన పాదయాత్రతో ఏపీ ప్రజానీకానికి టిడిపి ఇంకా బలంగా ప్రజలలో ఉంది అని చూపించారు. తండ్రి చాటు బిడ్డ ఏమీ తెలియదు అని అందరూ అంటుంటే పాదయాత్ర లో తన మాటలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
లోకేష్ తన పాదయాత్రతో ప్రత్యర్థి నాయకులకు నిద్ర లేకుండా చేశాడు .పాదయాత్ర లో స్థానిక టిడిపి నాయకులకు తన అండగా ఉంటానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ కలవర పడుతున్నాడంటే అతిశయోక్తి కాదు .పాదయాత్రతో లోకేష్ ఏం సాధించాడో అందరికీ చెప్పకనే తెలుస్తోంది.
ఈసారి ఎన్నికలలోనే కాదు వచ్చే 30 సంవత్సరాల వరకు టిడిపికి తిరుగులేదనే నమ్మకాన్ని ప్రజలలో కలిగిస్తూ టిడిపి నేతలకు భరోసా ఇచ్చాడు లోకేష్. చంద్రబాబు ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తూ, జగన్ అవినీతిని ఎత్తి చూపుతూ, వైసిపి నేతలు చేస్తున్న అవినీతిని ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు.
నారా లోకేష్ ను విమర్శించిన వారందరూ ఇప్పుడు లోకేష్ సభలకు వెళుతూ లీడర్ అంటే లోకేష్ లా ఉండాలి అని అందరూ అంటున్నారు. ఆంధ్ర కి దమ్మున్న నాయకుడు అంటే లోకేష్ అని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు.
ReplyReply allForward |