కృష్ణా జిల్లాకు బోర్డర్ లో ఉంటూ..అటు కృష్ణా నది ఎండింగ్..బంగాళాఖాతం పక్కనే ఉన్న దివిసీమ..అంటే అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. ఈ సీటుని దక్కించుకునేందుకు కీలక నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇక్కడ టిడిపి, వైసీపీలతో పాటు జనసేనకు కాస్త బలం ఉంది. కాపు ఓటు బ్యాంకు ఎక్కువ ఉండటంతో జనసేనకు కాస్త పట్టుంది.
అయితే ఇక్కడ జనసేన గెలుపోటములని డిసైడ్ చేసే స్థాయిలో ఉంది. జనసేన సింగిల్ గా గెలవడం కష్టం గాని..గెలుపోటములని ప్రభావితం చేయగలదు. గత ఎన్నికల్లో ఇక్కడ పోరు ఆసక్తికరంగా జరిగింది. వైసీపీ నుంచి సింహాద్రి రమేశ్ బాబు పోటీ చేసి దాదాపు 78 వేల ఓట్లు తెచ్చుకుంటే, టిడిపి నుంచి మండలి బుద్ధప్రసాద్ పోటీ చేసి 57 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అటు జనసేనకు 28 వేల ఓట్లు పైనే పడ్డాయి. ఇలా జనసేన ఓట్లు చీల్చడం వల్ల..వైసీపీ గెలిచేసింది.
అదే టిడిపి –జనసేన కలిసి పనిచేసి ఉంటే వైసీపీ గెలిచేది కాదు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన కీలకంగా ఉంది. కాకపోతే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేపై యాంటీ ఉంది. ఇటు టిడిపిలో మండలి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. దీంతో అవనిగడ్డ ప్రజలు మండలి వైపు వెళుతున్నారు. ఇదే సమయంలో జనసేన గాని టిడిపితో పొత్తు ఉంటే మండలి గెలుపు సులువే. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు టిడిపికే దక్కుతుంది. అక్కడ సీనియర్ నేత మండలిని సైడ్ చేయడం కష్టం.
ఒకవేళ పొత్తు లేకపోతే టిడిపి, వైసీపీల మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్రంలో ఉండే పరిస్తితులు, గాలి బట్టి గెలుపు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో టిడిపి నేత మండలికే మొగ్గు కనిపిస్తుంది.
ReplyReply allForward |