తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వేగంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల సర్వేల్లో టిడిపి ఆధిక్యంలో ఉందని తెలిసింది. టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే 80 పైనే సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వస్తుంది. అయితే అధికారంలోకి రావాలంటే టిడిపి ఇక కష్టపడాలి. ఇక జనసేనతో పొత్తు ఇంకా ప్లస్ కావచ్చు. అయినా టిడిపి ఒంటరిగా బలపడాల్సిన అవసరం ఉంది.
ఎలాగో వైసీపీ అనుకూల ప్రాంతాల్లో టిడిపికి బలం అనేది కాస్త కష్టం. కాబట్టి మిగిలిన స్థానాల్లో టిడిపి పట్టు సాధించాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో అనుకున్న విధంగా టిడిపి బలపడటం లేదని తెలిసింది. అసలు టిడిపి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బాగా బలపడింది. దాదాపు అన్నీ జిల్లాల్లో టిడిపికి పట్టు ఉంది. కానీ ఒకటి, రెండు జిల్లాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టిడిపి ఉంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలో టిడిపి పరిస్తితి అదే అని తెలుస్తుంది. 2014లో ఇక్కడ టిడిపి మంచి విజయాన్ని అందుకుంది.
కానీ 2019 ఎన్నికల్లో భారీగా దెబ్బతింది. ఏలూరు జిల్లాలో 7 స్థానాలు ఉన్నాయి. దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు సీట్లు ఉన్నాయి. ఈ 7 సీట్లలో వైసీపీ గెలిచింది. ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత వస్తుంది..అయినా టిడిపి అనుకున్న మేర బలపడటం లేదు. ఇటీవల సర్వేలో ఇక్కడ వైసీపీ 3, టిడిపి 2 సీట్లు గెలుచుకుంటుందని 2 సీట్లలో టఫ్ ఫైట్ ఉందని తేలింది.
దెందులూరు, ఉంగుటూరులోనే టిడిపికి లీడ్ ఉంది..మిగిలిన సీట్లలో ప్రభావం చూపడం లేదు. అసలు చింతలపూడి, పోలవరంలో వైసీపీకి యాంటీ ఉంది. కానీ అక్కడ టిడిపి అభ్యర్ధులపై క్లారిటీ లేకపోవడం మైనస్. ఇటు కైకలూరు జనసేనతో పొత్తు బట్టి గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. నూజివీడులో టిడిపి నేతల్లో ఐక్యత లేదు..అంతర్గత పోరు ఉంది. అదే టిడిపికి మైనస్. బలమైన అభ్యర్ధులు, టిడిపి నేతలు కలిసికట్టుగా పనిచేస్తే ఏలూరులో లీడ్ లోకి వస్తుంది. లేదంటే మళ్ళీ ఓటమే.