ఒకే నియోజకవర్గం..ఒకే ప్రాంతంలో అటు చంద్రబాబు, ఇటు జగన్ పర్యటించడం, బస చేయడం చేయనున్నారు. అది కూడా ఒకే రోజు. దీంతో ఇద్దరి నేతల పర్యటనలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కాకపోతే ఈ పర్యటనలతో ప్రజల్లో ఉండే నాయకుడు ఎవరు? ప్రజల మనిషి ఎవరు అనేది తేలిపోతుందనే చెప్పాలి. అయితే మామూలుగానే సిఎం జగన్..ప్రజల మధ్యలో ఉండేది తక్కువ. చిన్న చిన్న దూరాలకు కూడా హెలికాప్టర్ లోనే తిరుగుతున్నారు. పథకాలు పోతాయని, డ్వాక్రా మహిళలని, స్కూల్ పిల్లలని తీసుకొచ్చి భారీ సభలు నిర్వహిస్తున్నారు.
ఇక ప్రజల్లో జగన్ తిరిగేది తక్కువ. ఇటు బాబు మాత్రం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. రోడ్ షోలు, భారీ సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు బాబు, జగన్ ఒకే నియోజకవర్గానికి వెళుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా నెల్లూరు, ప్రకాశం పర్యటనలు ముగించుకుని ఏలూరు చేరుకున్న బాబు సోమవారం చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును పరిశీలించనున్నారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు. తర్వాత గోపాలపురం మీదుగా దేవరపల్లి చేరుకుని రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేస్తారు.
జగన్ కూడా పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అదే మండలం గొమ్ముగూడెం హెలిప్యాడ్కు చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు, అరగంట సేపు వరద బాధితుల నివాసిత ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తారు. సాయంత్రం హెలికాప్టర్ లో రాజమండ్రి చేరుకుంటారు.రాత్రి అక్కడే బస చేస్తారు.
అంటే ఇద్దరు నేతలు రాత్రి రాజమండ్రిలోనే ఉంటారు. అయితే ఇక్కడ ఇద్దరికీ తేడా ఏంటి అంటే..బాబు ఏమో ప్రజల మధ్య రోడ్ మార్గంలో వెళ్తారు. జగన్ ఎక్కడకక్కడ హెలికాప్టర్ లో తిరుగుతారు. దీంతో ప్రజల మధ్య ఉండేది ఎవరో క్లియర్ గా అర్ధమైపోతుంది. మాటకు మెదిలితే తాను పేదల మనిషి అని చెప్పుకునే జగన్ హెలికాప్టర్ లేనిదే అడుగుపెట్టారని తెలిసిపోతుంది. కాబట్టి ప్రజలే అసలు ప్రజా నేత ఎవరో తేల్చుకోవాలి.