కులాల ఆధారణంగా రాజకీయాలు చేయడం సర్వ సాధారణమైపోయింది. అయితే ఈ కుల రాజకీయాలు చేయడంలో వైసీపీ ఆరితేరిపోయింది. గత ఎన్నికల ముందు టిడిపిపై కుల ముద్రవేసి ఎలా దెబ్బకొట్టిందో చెప్పాల్సిన పని లేదు. టిడిపిలో ఒకే కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, పదవులు అన్నీ ఒక కమ్మ కులానికి ఇస్తున్నారని, అలాగే ఒకే కులం వారికే డిఎస్పిలుగా ప్రమోషన్స్ ఇచ్చారని ఆరోపణలు చేశారు.
కానీ అవేమీ నిజం కాదనే సంగతి తెలిసిపోయింది. టిడిపిలో అన్నీ కులాల వారికి ప్రాధాన్యత ఉంది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కమ్మ కులం నేతలనే కాస్త వెనుకబెడతారు. అలాంటిది టిడిపిపై కమ్మ ముద్ర వేసి రాజకీయంగా వైసీపీ లబ్ది పొందింది. అయితే వైసీపీ చెప్పినవన్నీ అబద్దాలు అని తర్వాత తేలిపోయింది. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా అదే కుల రాజకీయం చేస్తుంది. పైగా వైసీపీలో రెడ్డి వర్గానికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పాల్సిన పని లేదు. కీలకమైన పదవులు రెడ్డి వర్గానికి, ప్రాధాన్యత లేని పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తూ వచ్చారు.
ఇక ఇప్పటికే రెడ్డి వర్గం నేతలతో కీలక పదవులని నింపేశారు. ఇదే క్రమంలో టిటిడి ఛైర్మన్ పదవిని మరోసారి రెడ్డి వర్గానికే కట్టబెట్టారు. మొన్నటివరకు రెడ్డి వర్గం, జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డికి టిటిడి ఛైర్మన్ పదవి ఇచ్చారు. రెండుసార్లు ఆయనకు పదవి పొడిగించారు. సుబ్బారెడ్డి ఛైర్మన్ అయ్యాక టిటిడి లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో, ఎన్ని వివాదాలు చెలరేగాయో తెలిసిందే.
అయితే సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో బిసి నేతకు ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ జగన్ మళ్ళీ రెడ్డి వర్గానికే ఛాన్స్ ఇచ్చారు. ఈ సారి భూమన కరుణాకర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఆల్రెడీ తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తనయుడు తిరుపతి కార్పొరేషన్ వైస్ ఛైర్మన్..ఇలా పదవులు ఉన్నా సరే మళ్ళీ ఆయనకే టిటిడి బాధ్యతలు ఇచ్చారు. అంటే వైసీపీలో రెడ్డి వర్గం హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కానీ టిడిపి అధికారంలో ఉన్నప్పుడూ బిసి నేతలైన కాగిత వెంకట్రావు, చదలవాడ కృష్ణమూర్తి, పుట్టా సుధాకర్ యాదవ్లకు ఛాన్స్ ఇచ్చింది. కాబట్టి టిడిపి బిసిల పార్టీ..వైసీపీ రెడ్డి పార్టీ అని తేలిపోయింది.