రాష్ట్రంలో కుల రాజకీయాలకు కొదవ లేదనే చెప్పాలి. కులాల ఆధారంగానే రాజకీయం నడుస్తుంది. అయితే టిడిపిని దెబ్బతీయడానికి వైసీపీ ఎలాంటి రాజకీయం చేస్తూ వస్తుందో చెప్పాల్సిన పని లేదు. టిడిపి కమ్మ పార్టీ అని ముద్రవేసి గత ఎన్నికల్లో లబ్ది పొందింది. ఇప్పటికీ అదే రాజకీయం. కానీ వాస్తవం వేరు..వైసీపీలో రెడ్డి వర్గానికి ఏ స్థాయిలో పెద్ద పీఠ వేశారో చెప్పాల్సిన పని లేదు. ఇక టిడిపి అంటే కమ్మ పార్టీ అంటారు..కానీ ఆ కమ్మ వర్గం పూర్తిగా టిడిపికి మద్ధతు ఉండదు. వైసీపీకి సపోర్ట్ ఇస్తారు.
అందుకే కమ్మ వర్గం హవా ఉన్న కొన్ని స్థానాల్లో వైసీపీ హవా ఉంది. ఇక కమ్మ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న సీట్లలో ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వేకోడూరు ఒకటి. కడపలో పూర్తిగా రెడ్డి వర్గం డామినేషన్ ఉంటుంది. కానీ కమ్మ వర్గం ఓట్లు ఎక్కువగా ఏకైక సీటు రైల్వే కోడూరు. అందుకే గతంలో ఇది టిడిపి కంచుకోటగా ఉండేది. 1983 నుంచి 1999 వరకు ఏకధాటిగా ఇక్కడ టిడిపి విజయం సాధించింది. 2004లో వైఎస్సార్ వేవ్ లో ఓడిపోయింది. 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టిడిపి ఓడింది.
2014లో గెలుపు వరకు వచ్చి కేవలం 1400 ఓట్ల తేడాతో టిడిపి ఒంది. 2019లో జగన్ గాలిలో 34 వేల ఓట్ల మెజారిటీతో ఓడింది. అయితే కమ్మ ఓట్లు ఎక్కువ ఉన్న ఇక్కడ టిడిపి గెలవడం లేదు..అంటే కమ్మ వర్గం కొంత వైసీపీ వైపు మొగ్గు చూపుతుంది. పైగా ఇది రిజర్వ్ సీటు.
దీంతో కమ్మ వర్గం పూర్తిగా టిడిపికి సహకరించడం లేదు. అంటే గెలిచిన తమ పెత్తనం ఉండదని చెప్పి వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. అందుకే ఇక్కడ టిడిపి గెలవడం లేదు. ఇప్పటికీ అక్కడ వైసీపీకే లీడ్ ఉంది.