మొన్న లోకేష్..నిన్న చంద్రబాబు..ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తగ్గేదెలే అన్నట్లు టూర్లు కొనసాగాయి. ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని..నెల్లూరులో అద్భుతంగా పాదయాత్ర ముగించుకుని..ప్రకాశం జిల్లాలో ఊహించని స్థాయిలో లోకేష్ పాదయాత్రకు ప్రజా స్పందన లభించింది. అప్పటివరకూ పాదయాత్ర ఒక ఎత్తు అయితే…ప్రకాశంలో ఒక ఎత్తు అన్నట్లు నడిచింది. లోకేష్ పాదయాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
అయితే మామూలుగా పశ్చిమ ప్రకాశంలో టిడిపికి పెద్ద పట్టు ఉండదు. కానీ ఆ ప్రాంతంలో కూడా లోకేష్ పాదయాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ప్రతి నియోజకవర్గంలో భారీ సభలు జరిగాయి. ఇలా లోకేష్ పాదయాత్రతో టిడిపికి కొత్త ఊపు వచ్చింది. మామూలుగానే ప్రకాశం జిల్లా టిడిపి నేతలు దూకుడుగా పనిచేస్తూ..పార్టీని మరింత బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇక లోకేష్ పాదయాత్రతో అక్కడ టిడిపి మరో స్థాయికి వెళ్లింది.
ఇక లోకేష్ పాదయాత్ర అయినా వెంటనే చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా ప్రకాశంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టుని బాబు పరిశీలించారు. ఆ ప్రాజెక్టుకు వైసీపీ చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. అక్కడ పరిధిలోని సంతనూతలపాడు నియోజకవర్గంలో అనూహ్యంగా వేలమంది రావడంతో భారీ సభ నిర్వహించారు. ఇలా ప్రకాశంలో లోకేష్, చంద్రబాబులు అదరగొట్టేశారు. దీంతో టిడిపి బలం మరింత పెరిగిందని చెప్పవచ్చు.
ప్రకాశంలో 12 సీట్లు ఉంటే టిడిపి ఈ సారి 8 పైనే సీట్లు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అద్దంకి, పర్చూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, ఒంగోలు, చీరాల లాంటి సీట్లలో సత్తా చాటడం ఖాయం. మొత్తానికి ప్రకాశంలో సైకిల్ జోరు కొనసాగుతుంది.