ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలు, టిడిపి జనసేన పొత్తు ఇవన్నీ వైసిపికి తీరని నష్టాన్ని కలిగిస్తాయని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీకి పట్టు దక్కిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో మొత్తం 53 అసెంబ్లీ స్థానాలు ఉండగా కేవలం వైసీపీ 19 స్థానాలు మాత్రమే దక్కించుకోగలదు అని ఇప్పటి పరిస్థితులను బట్టి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వై నాట్ 175 అంటూ ప్రజల ముందుకు వెళుతున్న జగన్ ఒక వంతు స్థానాలు కూడా గెలుచుకోలేరేమో అని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అనుమానం కలిగిస్తోంది.
కృష్ణ, గుంటూరు, ప్రకాశం ,నెల్లూరు ఈ నాలుగు జిల్లాలలో 34 స్థానాలు టిడిపి జనసేన పొత్తులో సొంతం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిడిపి జన సేన పొత్తులో గెలిచే నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూద్దామా… విజయవాడ ఈస్ట్& వెస్ట్, సెంట్రల్, జగ్గయ్యపేట, గన్నవరం, పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, తెనాలి, పెదకూరపాడు, గురజాల, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి, దర్శి, కొండపి, ఆత్మకూరు, అద్దంకి, పర్చూరు, బాపట్ల, కనిగిరి, సంతనూతలపాడు, కావలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కొవ్వూరు, గూడూరు, గిద్దలూరు ఈ స్థానాలన్నింటిలోనూ ఈసారి కచ్చితంగా టిడిపి జనసేన అభ్యర్థులు మాత్రమే గెలుస్తారని రాజకీయ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. వీటికి ప్రధాన కారణం ప్రజలలో వైసిపి ఉన్న తీవ్ర వ్యతిరేకత అనే చెప్పకనే తెలుస్తోంది.