టీడీపీ కంచుకోటలని కూల్చడానికి జగన్ ఎన్ని రకాలుగా రాజకీయ ఎత్తులు వేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు..టిడిపి కంచుకోటలపై ఫోకస్ పెట్టి..వైసీపీ బలం పెంచుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపికి కంచుకోటగా ఉన్న రేపల్లెపై కూడా పట్టు సాధించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
రేపల్లె అంటే టిడిపి కంచుకోట. ఆరుసార్లు టిడిపి సత్తా చాటింది. 1989, 2004, 2009 ఎన్నికల్లోనే ఓటమి పాలైంది. ఇక గత రెండు ఎన్నికల్లో రేపల్లెలో టిడిపి గెలుస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. టిడిపి అధికారంలో ఉండగా, రేపల్లెని అభివృద్ధి బాటపట్టించారు. దీంతో 2019లో జగన్ గాలిలో కూడా అక్కడ అనగానిని గెలిపించారు. అయితే టిడిపి అధికారంలోకి రాకపోయినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నారు. అటు ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. దీంతో రేపల్లెలో ఆయన తనయుడు పెత్తనం చేస్తున్నారు.
నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన తనయుడుకే సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అధికారంలో ఉండటంతో..ఆ బలంతో స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. రేపల్లె మున్సిపాలిటీని గెలుచుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ పరిస్తితి ఉండదు. రేపల్లె ప్రజలు టిడిపి వైపే మొగ్గు చూపనున్నారు.
ఇక ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువ. అందులో అనగాని సొంత వర్గం గౌడ ఓట్లు ఎక్కువే. అటు మోపిదేవి మత్స్యకార వర్గం ఓట్లు ఉన్నాయి. వారు వైసీపీ వైపు మొగ్గు చూపుతారు. కమ్మ వర్గం టిడిపికే సపోర్ట్..మిగిలిన బిసి వర్గాల్లో మెజారిటీ టిడిపికే మద్ధతు ఉంది. ఎస్సీలు ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉన్నారు. మొత్తానికి రేపల్లెలో టిడిపికి లీడ్ ఉంది. అనగాని హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.