తెలుగుదేశం పార్టీ అన్నీ జిల్లాల్లో బలపడుతున్నట్లే కనిపిస్తోంది..కానీ టిడిపి బలంగా ఉండే కృష్ణా జిల్లాలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇక్కడ టిడిపికి పట్టు దొరుకుతుంది గాని సొంత పార్టీ నేతలే దెబ్బతీసేలా ఉన్నారు. టిడిపిలో ఉన్న అంతర్గత పోరు మైనస్ అయ్యేలా ఉంది. ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లాలో టిడిపి సత్తా చాటేది. గత ఎన్నికల్లోనే టిడిపి ఘోరంగా ఓడింది.
అయితే అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. అయినా టిడిపి బలపడినట్లు కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 16 సీట్లు ఉంటే టిడిపి ఖచ్చితంగా ఇన్ని సీట్లు గెలుస్తుందని చెప్పలేని పరిస్తితి. ప్రస్తుత పరిస్తితుల్లో టిడిపి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉన్నాయనుకునే సీట్లు మచిలీపట్నం, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట మాత్రమే..అంటే ఐదు సీట్లే క్లారిటీగా ఉన్నాయి. ఇక జనసేనపై పొత్తు బట్టి మరికొన్ని సీట్లు ఆధారపడి ఉన్నాయి. కానీ పొత్తులో సంబంధం లేకపోయినా కొన్ని సీట్లలో టిడిపి నేతల మధ్య ఆధిపత్య పోరు వల్ల నష్టపోవాల్సి వస్తుంది.
గుడివాడలో సీటు కోసం పోటీ పడేవారు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ క్లారిటీ లేదు. అటు గన్నవరం పరిస్తితి అంతే. ఇక నూజివీడులో నేతలు కలిసికట్టుగా పనిచేయడం లేదు. తిరువూరులో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నారు. పెడనలో తమ్ముళ్ళ పోరు ఎక్కువగానే ఉంది. విజయవాడ వెస్ట్ లో అదే రచ్చ. మైలవరంలో దేవినేని ఉమాకు యాంటీగా కొందరు నేతలు పనిచేస్తున్నారు. నందిగామలో అదే పరిస్తితి.
కైకలూరులో అసలు ఇంచార్జ్ లేరు. అవనిగడ్డ సీటు జనసేన బట్టి ఆధారపడి ఉంది. విజయవాడ తూర్పులో టఫ్ ఫైట్ ఉంది. ఇలా ఎక్కడకక్కడ దారుణమైన పరిస్తితులు ఉన్నాయి. మధ్యలో జనసేన ప్రభావం ఉంది. అయితే టిడిపి నేతలు ఐక్యంగా పనిచేస్తే పొత్తు లేకుండా కనీసం 10 సీట్లు గెలుచుకోవచ్చు. అలా కాకుండా ఇలాగే కుమ్ముకుంటే కంచుకోటల్లోనే టిడిపి ఓడిపోయే ప్రమాదం ఉంది.