వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న అధికార పార్టీ వైసీపీ ఆదిశగా దూకుడు పెంచింది. గత ఎన్నికల్లో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీ.. ఈ సారి 175 టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఎంతైనా రాజకీయాలు రాజకీయాలే అన్నట్టుగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసుకున్నాక.. ఏయే అంశాలపై వీక్గా ఉందో.. ఏయే వర్గాల వారికి చేరువ కాలేక పోయిందో ఒక నిర్ణయానికి వచ్చేశారు.
ప్రధానంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. అదేసమయంలో మార్పుల దిశగా సమాజాన్ని నడిపిస్తున్నారు. పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇక, నాడు -నేడు వంటి కార్యక్రమం ద్వారా.. విద్యాలయాలు, ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99శాతం వరకు హామీలను పూర్తి చేసినట్టు వైసీపీ చెబుతోంది. మొత్తంగా ఈ పరిణామాలు వచ్చే ఎన్నికలలో తమకు ప్లస్ అవుతాయనేది సీఎం జగన్ విశ్వాసం.
కానీ ఇదంతా వైసీపీ వర్షన్..ప్రజల్లో మాత్రం..జగన్ చాలా సార్లు ఇచ్చిన మాట తప్పారని, హామీలు సరిగ్గా అమలు చేయలేదని అసంతృప్తి ఎక్కువ ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగులు..ఈ రెండు వర్గాల్లో ఫుల్ మైమస్.!
1) నిరుద్యోగులు: రాష్ట్రంలోని నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అడ్రెస్ లేదు.
2) ఉద్యోగ వర్గాలు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ హామీ పై చేతులు ఎత్తేసింది. వారికి అడుగడుగునా హ్యాండ్ ఇస్తూనే వస్తుంది. ఇప్పటికే ప్రజలు అసంతృప్తి గా ఉన్నారు..నిరుద్యోగులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీని బట్టి చూస్తే వైసీపీ ఓటమి దాదాపు ఖాయమనే చెప్పాలి.
ReplyReply allForwardAdd reaction |