రాష్ట్రం లో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మారుతూ ఉన్నాయి. గెలిచే అభ్యర్థుల కోసం ఇరుపార్టిలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి పట్టు ఉందో సర్వేలు నిర్వహిస్తున్నాయి.
అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, మాడుగుల, పెందుర్తి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలలో టిడిపి జనసేనకి మద్దతు ఉందని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో అనకాపల్లి ఓటర్లు ఈసారి టిడిపి కూటమి వైపే చూస్తారని అందరూ చెబుతున్నారు.
అనకాపల్లి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో మాడుగుల నియోజకవర్గం ఒక్కటే వైసిపికి గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. మాడుగుల నియోజకవర్గ ప్రజలలో వైసిపి పై వ్యతిరేకత ఉన్నా, ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టిడిపిలో సరైన నాయకత్వం లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బోడి ముత్యాల నాయుడు బరిలో ఉన్నారు. ముత్యాల నాయుడు కు ఉన్న సొంత ఇమేజ్ తో మాడుగుల వైసీపీకి పట్టు ఏర్పడిందని చెప్పవచ్చు. టిడిపిలో వర్గ విభేదాలను పక్కన పెడితే కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మిగిలిన ఐదు నియోజకవర్గాలలో టిడిపి జనసేన కూటమి విజయం సాధిస్తుందని సామాన్యుల సైతం చెబుతున్నారు.
మరిఈ అంచనాలన్ని ఎన్నికలవేళ నిజమవుతాయా??? లేక వైసిపి వ్యూహాలు ఫలిస్తాయా??? వేచి చూడాల్సిందే……