కేంద్రంలో మిత్రపక్షాలైన కొన్ని అంశాల్లో బిజేపిని వ్యతిరేకిస్తాయేమో గాని.. పైకి సంబంధం లేనట్లు ఉంటూ..అంతర్గతంగా బిజేపి మిత్రుడుగా ఉంటున్న జగన్ మాత్రం ప్రతి అంశంలోనూ మోదీ సర్కార్కు సపోర్ట్ గానే ఉంటారు. ఇప్పటివరకు పార్లమెంట్ లో బిజేపి తెచ్చిన ప్రతి బిల్లుకు జగన్ జై కొట్టారు. అలాగే బిజేపి సైతం..జగన్కు అండగానే ఉంటుందనే విషయం గురించి చెప్పాల్సిన పని లేదు. అడిగినప్పుడు అప్పు పుడుతుంది..నిధులు బాగానే వస్తున్నాయి.
కాబట్టి జగన్..బిజేపి మనిషి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా మరోసారి జగన్ అంశం ఢిల్లీ స్థయిలో చర్చగా మారింది. మణిపూర్ హింసని అరికట్టడంలో బిజేపి ఫెయిల్ అయిందని, మణిపూర్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ తో విపక్షాలుకలిసి మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఇక అవిశ్వాసానికి వ్యతిరకంగా, బిజేపికి మద్ధతుగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది.
ఇక ఢిల్లీ రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు ఉద్దేశించిన ఆర్డినెన్స్కు బదులుగా తీసుకొస్తున్న బిల్లుకు మద్దతివ్వాలని జగన్ నిర్ణయించారు. దీంతో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్కు జగన్ షాక్ ఇచ్చినట్లు అయింది.
దేశ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ సవరణ బిల్లు, 2023కు మద్దతు కూడగట్టడం కోసం కేజ్రీవాల్ అనేక ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బిఆర్ఎస్ సహ పలు విపక్షాలు ఆయనకు మద్ధతు ఇచ్చాయి. కానీ వైసీపీ కేంద్రం తెచ్చే బిల్లుకు మద్ధతు ఇస్తుంది. దీని బట్టి చూస్తే బిజేపి-జగన్ ఒక్కటే అని చెప్పుకోవచ్చు.
కానీ అదే బిజేపితో జనసేన పొత్తులో ఉంది. పవన్ మాత్రం జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇటు టిడిపితో బిజేపి-జనసేన కలుస్తాయని అంటున్నారు. అయితే బిజేపి మాత్రం జగన్కు సపోర్ట్ ఇస్తుంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు..బిజేపితో పొత్తుపై ఆలోచించుకోవాలని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. బిజేపితో పొత్తు వల్ల తమకే నష్టమని, మళ్ళీ జగన్ కే మేలు జరుగుతుందని, బిజేపి ప్లాన్ కూడా అదే అంటున్నారు. మరి బాబు పొత్తుపై ఏం చేస్తారో చూడాలి.