రాయలసీమ..వైసీపీ కంచుకోట. గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవానే నడిచింది. గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచింది. సీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు కలిపి మొత్తమ్ 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది. టిడిపికి కేవలం 3 సీట్లే వచ్చాయి. అంటే వైసీపీ హవా ఏ స్థాయిలో నడిచిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఇన్ని సీట్లు వచ్చిన వైసీపీ సీమకు చేసిందేమైనా ఉందా? అంటే పెద్దగా ఏమి కనిపించలేదు.
అందరికీ వచ్చినట్లే సీమ ప్రజలకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనుకున్న మేర అభివృద్ధి లేదు. రోడ్ల పరిస్తితి దారుణం. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పారు గాని ..ఇంతవరకు అదీ జరగలేదు. ఇక ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులకు వైసీపీ చేసిందేమి లేదని తేలింది. సీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం టిడిపి ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు పెడితే..వైసీపీ నాలుగేళ్లలో ఖర్చు పెట్టింది కేవలం రూ.2 వేల కోట్లు. అందుకే జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు అంటున్నారు. అలాగే టిడిపి హయంలో అనేక కంపెనీలు వచ్చాయని, వైసీపీ హయంలో వచ్చినవి శూన్యమని అంటున్నారు.
ఇలా సీమ కోసం టిడిపినే పనిచేసిందని, వైసీపీ ఏమి చేయలేదని తేలిపోయింది. అందుకే అక్కడి ప్రజల్లో మార్పు వస్తుంది. ముఖ్యంగా వైసీపీకి సపోర్ట్ చేసే రెడ్డి సామాజికవర్గంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఏదో కొంతమంది రెడ్లు తప్ప..మిగతా వారికి ఒరిగింది ఏమి లేదు.
కాబట్టి ఈ సారి సీమలో వైసీపీకి భారీ దెబ్బ తగిలేలా ఉంది. వైసీపీ ఆధిక్యానికి గండి పడటం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 52 సీట్లలో టిడిపి 20-25 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అంటే వైసీపీ ఆధిక్యానికి భారీగా గండి పడనుంది.