లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జోరు వానలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీని బట్టి చూస్తుంటే లోకేష్ ప్రజా నాయకుడుగా ఎదుగుతున్నారని తెలుస్తుంది. ఆయన ప్రజలతో మమేకమవుతున్న తీరు..ప్రజల కష్టాలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం కోసం ఇస్తున్న హామీలు..ఇలా ప్రతి అంశం ఆకట్టుకుంటుంది. జగన్ ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలపై ఆధారాలతో సహ చేస్తున్న ఆరోపణలు ఆలోచించే విధంగా ఉంటున్నాయి.
అందుకే పాదయాత్రకు రోజుకు రోజుకు ప్రజా స్పందన పెరుగుతుంది. ఇక తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంచుకోట ఒంగోలులో పెద్ద ఎత్తున లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయింది. సభకు భారీగా జనం వచ్చారు. దీంతో ఒంగోలులో టిడిపి జోరు పెరిగిందని తెలుస్తుంది. అయితే ఒంగోలులో బాలినేనికి పట్టు ఎక్కువ. ఆయన అయిదుసార్లు ఇక్కడ గెలిచారు. 1999, 2004, 2009, 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో గెలిచారు. 2014లోనే ఓడిపోయారు.
అయితే ఈ సారి బాలినేనికి చెక్ పెట్టాలని చెప్పి టిడిపి ఇంచార్జ్ దామచర్ల జనార్ధన్ కష్టపడుతున్నారు. 2014లో ఈయన టిడిపి నుంచి గెలిచి..ఒంగోలులో అభివృద్ధి పనులు బాగానే పనిచేశారు. ఇప్పుడు బాలినేని అభివృద్ధి తక్కువే. కాకపోతే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. అయితే బాలినేనికి దామచర్ల గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఎన్నికల సమయానికి ఇంకా పరిస్తితి మారిపోయే ఛాన్స్ ఉంది.
అలాగే ఇక్కడ జనసేనకు 10-15 వేల ఓట్లు ఉంటాయి. టిడిపితో పొత్తు ఉంటే ఆ ఓట్లు కలిసొస్తాయి. అప్పుడు బాలినేనికి రిస్క్ పెరుగుతుంది. ఇక ఎలాగో లోకేష్ పాదయాత్ర చాలావరకు టిడిపికి హైప్ తెచ్చింది. ఇదే ఊపు కొనసాగితే ఒంగోలులో బాలినేనికి చెక్ పడటం ఖాయం.