చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిణామాల గురించి, అరెస్టు గురించి ప్రజలు, టిడిపి కార్యకర్తలు, జనసేన నేతలు, బిజెపి వారు, వైసీపీ వారు ఏమనుకుంటున్నారో అని INAS వారు సి ఓటర్ తో కలిపి ఒక సర్వే ని నిర్వహించారు. ఆ సర్వే ఏ పార్టీకి మద్దతుగా చేసింది కాదు. ఇటు అధికార పార్టీకి గానీ, అటు ప్రతిపక్ష పార్టీకి గాని సంబంధం లేని సర్వే సంస్థ చేసిన సర్వే ఇది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు చాలా వెలుగులోకి వచ్చాయి.
అరెస్టుతో టిడిపికి, చంద్రబాబు నాయుడుకి ప్రజలలో సానుభూతి వచ్చింది అని, ఈ సర్వే ఖచ్చితంగా చెబుతోంది. సామాన్య ఓటర్లే కాకుండా వైసిపి అభిమానులు కూడా 40 శాతం మంది చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారని తమ సానుభూతిని తెలియజేశారు. టిడిపి వారైతే వందకి దాదాపు 90 శాతం పైనే సింపతినే వచ్చింది అని అన్నారు. సామాన్యులు సైతం అరెస్టు వలన టిడిపికి సింపతి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు అరెస్టు తరువాత జరిగిన పరిణామాల వలన జగన్ అభద్రతాభావంతో ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం సర్వే చేసిన వారిలో 50% కి పైగా జగన్ అభద్రాతాభావంతో ఉండే చంద్రబాబును అరెస్టు చేయించారని, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాల వలన ఇంకా అభద్రతాభావం లోనే కొనసాగుతున్నారని అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబుని దెబ్బ కొట్టాలనే వైసీపీ వ్యూహం తిరిగి తమ మెడకే చుట్టుకున్నట్లు ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.