రాష్ట్రంలో ఆదాయం కన్నా చేసే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే.ఎన్నికల హామీలు అంటూ సంక్షేమ పథకాల పేరుతో జగన్ ప్రతినెల ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో డబ్బును ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టే డబ్బుకు సరిపడా ఆదాయం రాష్ట్ర ఖజానాలో లేనందువల్ల అప్పు తెచ్చి మరి ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో నెలవారీ ఖర్చులకు, ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు దాదాపు 4 వేల కోట్లు పైచిలుకు కావలసి ఉంది.కానీ ప్రతి నెల ఈ డబ్బుల కోసమే జగన్ ఆర్బిఐ నుంచి అప్పు తీసుకుంటున్నారు.ఈ ఆర్థిక సంవత్సరానికి మనకు మనం తీసుకోవాల్సిన అప్పు కన్నా ఎక్కువే తీసుకున్నామని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
జనవరి నెలలో సాధారణ ఉద్యోగుల జీతాలు ,నెలవారి ఖర్చులతో పాటు జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టే కీలకమైన రెండు పధకాల అమలు ఉంది.అది వైయస్సార్ ఆసరా, చేయూత ఈ రెండు పథకాల కోసం దాదాపు 8 వేల కోట్లు కావాల్సి ఉంది.వీటితోపాటు ఉద్యోగులకు ఇస్తానన్న రెండు డిఏలు,పెరిగిన పెన్షన్ల మొత్తం ఇవన్నీ అదనపు ఖర్చులే.వీటి కోసం జగన్ ఎక్కడి నుంచి అప్పు తెస్తారు అన్నది ప్రశ్నగా మారింది. అప్పు తీసుకోవాలి అంటే అప్పు పరిమితి దాటేసామని,ఆర్బిఐ నిబంధనలను ఆంధ్రప్రదేశ్ దాటిపోయిందని అంటున్నారు.కానీ మోడీ జగన్ కు మద్దతుగా ఉన్నందువల్ల ఇప్పటివరకు అనుకున్నదంతా బాగానే నడిచింది.మరి ఈసారి ఈ జనవరిలో మోడీ జగన్ కు సహకరిస్తారా లేదా అన్నదే కీలక అంశం.జనవరిలో అనుకున్నది అనుకున్నట్లు జరిగితే జగన్ గట్టెక్కినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మరి మోడీ సహకారంతో ఆర్.బి.ఐ అప్పు ఇస్తుందా లేదా వేచి చూడాల్సిందే.