ఎవరినైనా చదువుకుంటున్న విద్యార్థిని నీవు ఏం కావాలి అని అడిగితే వచ్చే ప్రశ్న సమాధానం “ప్రభుత్వ ఉద్యోగం”,ఆడపిల్లలకు పెళ్లి చేయాలనే తల్లిదండ్రులకు ఎలాంటి వరుడు కావాలి అంటే వచ్చే సమాధానం “ప్రభుత్వ ఉద్యోగం” తల్లిదండ్రుల కల కొడుకు ‘ప్రభుత్వ ఉద్యోగి” కావడం.ప్రభుత్వ ఉద్యోగి అంటే నిన్న మొన్నటి వరకు ఫ్యాన్ కింద ఉద్యోగం, చక్కగా సెలవులు, ఒకటో తారీకు జీతం వస్తుందని అందరూ అనుకునేవారు. ఎవరు ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉద్యోగికి కచ్చితంగా ఒకటో తారీఖున జీతం అందుతుందని ప్రజలందరి భావన. కానీ ఇప్పుడు ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఒకటో తారీకున రావలసిన జీతం నెలాఖరుకు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని ఉద్యోగులు అంటున్నారు.నెల అంతా కష్టపడేది ఆ జీతం కోసమే అని,కానీ ఆ జీతం అందుకోవడానికి మరో నెల ఎదురు చూడాల్సి వస్తోందని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు.
ఏ ప్రభుత్వమైనా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభుత్వానికి మంచిది కాదని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు.గతంలో ఎవరో ఒక నాయకుడు అన్నాడట “ఉద్యమాలు లేని ఉద్యోగ వ్యవస్థ కావాలని” ఇప్పుడు అదే జరుగుతుంది. ‘ఇంక్రిమెంట్లు గొడవ లేదు,బకాయిలపై ఆశ లేదు, నెల జీతం వస్తే చాలు’రా అని ఎదురుచూసే రోజులు వచ్చాయి.
సోషల్ మీడియా వేదికగా ఉద్యోగుల జీతాల గురించి సెటైర్లు వేసుకునే స్థాయికి ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి వచ్చిందంటే,దీనికి ఎవరు కారణము ఆలోచించాల్సిందే.జీతాలు,పెన్షన్లు ఇవ్వవలసిన బకాయిలు వేటికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదు,కానీ ఇస్తానన్న పథకానికి మాత్రం ఆ సమయానికి అప్పు తెచ్చి మరీ ఇస్తున్నారు. ఎందుకంటే అవి ఓట్లు కాబట్టి. ఇక్కడ అధికార పార్టీ మర్చిపోతున్నదేమో ఉద్యోగులు కూడా ఓటర్లే కదా,ఆ మాట ఎలా మరిచిపోతున్నారు.ఒక సామాన్యుడు ఓటు వేస్తే తన ఓటు మాత్రమే పడుతుంది.అదే ఒక ఉద్యోగి ఓటు వేస్తే తన చుట్టూ ఉన్నవారిపై ప్రభావం ఉంటుంది.ఉద్యోగి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్న వారిపైన కూడా అతని ప్రభావం ఉంటుంది.ఈ విషయాన్ని అధికార పార్టీ ఎలా మరిచిపోయిందా అని రాజకీయ వర్గాలు అంటున్నారు.
మరి ఈ నెలైనా గత నెల జీతం వస్తుందంటారా మాస్టారు…
ReplyReply allForward |