కడప ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా. కడపలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు.రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పవచ్చు. తన తోచింది మాత్రమే నిజమని నమ్మే వ్యక్తి.ప్రజలందరికీ తనంటే అభిమానమని వారు వద్దు అనే వరకు ఈ పదవినిగా వదలను అని బహిరంగంగానే చెబుతూ ఉంటారు. కానీ రమేష్ వ్యవహార శైలి వల్ల వైసీపీ క్యాడర్ మొత్తం ఒక్కొక్కరూగా దూరం అవుతూ వచ్చారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ శివప్రసాద్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కానీ,శివప్రసాద్ రెడ్డితో కలిసి ఉండటం వల్ల రమేష్ యాదవ్ రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేశారని కోపంతో జగన్ ను కలిసి ఎవరి రికమండేషన్ లేకుండానే ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు.అప్పటినుండి రమేష్ యాదవ్ కు శివ ప్రసాద్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వివాదాలు ఉన్నాయి. వీరిద్దరికీ అసలు పొసగడం లేదు.అంతేకాకుండా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీరుతో ప్రొద్దుటూరులోని మండల స్థాయి నాయకులంతా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ దగ్గరకు చేరారు.నియోజకవర్గ ప్రజలలో కూడా రాచమల్లు అంటే విముఖత కనిపిస్తోంది.
ముస్లిం చెట్టు తగాదా విషయంలో రాచమల్లు నుండి ఎటువంటి స్పందన లేదని వైస్ చైర్మన్ కాజా, కౌన్సిలర్లు వైసీపీని వీడారు.రాచమల్లు మీద కోపంతో వైసిపి నేతలందరూ కొందరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వర్గంలో చేరగా,మరికొందరు ద్వితీయ శ్రేణి కార్యకర్తలందరూ టిడిపిలో చేరారు. కార్యకర్తలు రమేష్ యాదవ్ వద్దకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్న రాజమల్లు, కొందరు టిడిపిలో చేరగానే ఉలిక్కిపడ్డారు.
రాచమల్లు వ్యతిరేక వర్గం అంతా టిడిపిలో చేరి రాచమల్లు పై విమర్శలు చేస్తున్నారు.ఆ విమర్శలు వైసిపి ప్రభుత్వం పై ప్రభావాన్ని చూపుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ వైసిపి పై ప్రభావాన్ని చూపేవి.ఇప్పటికైనా అధిష్టానం స్పందించి ప్రొద్దుటూరు విషయంలో కలగచేసుకుని రాజమల్లుకు సర్ది చెప్పకపోతే ఈసారి ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసిపి గెలిచే అవకాశాలు శూన్యమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.