ఏం అనుకున్నారో ఏమో గాని..జనంలో తిరగకపోతే..ఇంకా జనం పట్టించుకోరు అని అనుకుంటారు..అందుకే జగన్ ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏదొక బటన్ నోక్కే కార్యక్రమం పెట్టి..భారీగా బస్సులు పెట్టి ప్రజలని తరలించి సభలు పెట్టేవారు. కానీ ఇప్పుడు జగన్ ప్రజల్లోకి వచ్చారు. తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించారు. పోలవరం పరిధిలో వరద ముంపు బాధితులతో మాట్లాడారు.
అయితే ఎంత తిరుగుతున్న ప్రజల నుంచి మంచి స్పందన రావడం లేదు. పైగా పోలవరం నిర్వాసితులకు తాను ఏం చేయలేను అన్నట్లు మాట్లాడారు. ఇక పోలవరం 2025లో పూర్తి అవుతుందని చెప్పుకొచ్చారు. ఏదో వైసీపీ కార్యకర్తల తప్ప..పూర్తిగా జగన్ ప్రయత్నాల్లో జనం కనిపిస్తున్నట్లు లేరనే విమర్శలు వస్తున్నాయి. ఇక గోదావరి జిల్లాల్లో రాజకీయంగా బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఇక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో టిడిపి బలం పెరుగుతుంది..అటు జనసేనతో పొత్తు ఉంటే వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ క్రమంలో జగన్ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. కానీ ఆ పర్యటన అనుకున్న మేర సక్సెస్ అయినట్లు కనిపించలేదు..వైసీపీ అనుకూల మీడియా సంస్థలు బాగా పైకి లేపాలని చూశాయి..కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. ఏదేమైనా గోదావరి జిల్లాల్లో టిడిపికి ఆధిక్యం కనిపిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15 సీట్లు ఉంటే టిడిపి 7 సీట్లలో లీడ్ ఉంది. ఇక జనసేనకు 3 సీట్లలో పట్టు ఉంది. ఈ రెండు పార్టీలు కలిస్తే పశ్చిమలో వైసీపీకి 1 లేదా 2 సీట్లే వస్తాయి.
తూర్పులో 19 సీట్లు ఉంటే టిడిపికి 9 సీట్లు, జనసేనకు 3 సీట్లలో ఆధిక్యం ఉంది. వైసీపీకి 3 సీట్లలో పట్టు కనిపిస్తుంది. ఇక్కడ టిడిపి-జనసేన కలిస్తే 15 సీట్లు సులువుగా గెలుచుకుంటాయి. మొత్తానికి గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదు.