తెలుగుదేశం పార్టీలో అన్నీ వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే వైసీపీలో పూర్తి డామినేషన్ ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలు..టిడిపిలో కూడా ఉన్నారు. చంద్రబాబు అంటే అభిమానంతో ఉండే రెడ్డి నేతలు ఎక్కువే. అయితే గత ఎన్నికల్లో రెడ్డి వర్గం పూర్తిగా వైసీపీకే మద్ధతు ఇచ్చింది. దీంతో టిడిపి నుంచి ఒక్క రెడ్డి నేత గెలవలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కొంతమంది రెడ్డి నేతలకే న్యాయం జరిగింది గాని..సామాన్య రెడ్డి వర్గం ప్రజలకు ఒరిగింది ఏమి లేదు.
దీంతో ఇప్పుడు 35 శాతం పైనే రెడ్లు టిడిపి వైపు చూస్తున్నారు. అలాగే ఈ సారి టిడిపిలో రెడ్డి వర్గం నేతలు విజయం దిశగా వెళుతున్నారు. అలా విజయ అవకాశాలు ఉన్న రెడ్డి నేతల్లో మొదట..పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన ఈయన..ఈసారి గెలుపుకు దగ్గరలో ఉన్నారు. అటు పలమనేరులో అమర్నాథ్ రెడ్డికి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు లేదా వెంకటగిరిలో ఆనం రామ్ నారాయణ రెడ్డికి గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి.
అలాగే సర్వేపల్లిలో ఈ సారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సానుభూతి ఉంది..ఈయనకు ఛాన్స్ కనిపిస్తోంది. కావలి సీటు కావ్య కృష్ణారెడ్డికి దక్కే ఛాన్స్ ఉంది. అక్కడ టిడిపికి గెలుపు సులువే. ఇటు కనిగిరిలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఈ సారి గెలవడం ఖాయమే. అటు తాడిపత్రిలో జేసి ప్రభాకర్రెడ్డి, బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, మంత్రాలయంలో తిక్కారెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తిలో సుధీర్ రెడ్డి…ఇలా టిడిపిలో పలువురు రెడ్డి నేతలు ఈ సారి గెలుపు గుర్రం ఎక్కేలా ఉన్నారు.