ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం..టీడీపీకి పట్టున్న స్థానం…2009 ఎన్నికలకు ముందు భోగాపురం అసెంబ్లీ స్థానంగా ఉండేది. అప్పుడు టిడిపి విజయాలు వరుసగా వచ్చాయి. 1983 నుంచి 2004 వరకు వరుసగా పతివాడ నారాయణస్వామి విజయం సాధించారు. 6 సార్లు సత్తా చాటారు. ఇక టిడిపి విజయాలు సాధిస్తుందని చెప్పి నియోజకవర్గంలో కొన్ని మండలాలని అటు, ఇటు మార్చి నెల్లిమర్లగా ఏర్పాటు చేశారు.
దీంతో 2009 ఎన్నికల్లో టిడిపికి ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ నుంచి అప్పలనాయుడు గెలిచారు. ఈయన మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు. ఇక 2014 ఎన్నికలకు వచ్చేసరికి టిడిపి గెలిచింది. టిడిపి నుంచి పతివాడ గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో సీన్ మారింది. బొత్సతో పాటు అప్పలనాయుడు కూడా వైసీపీలోకి వచ్చారు. వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఎమ్మెల్యేగా అప్పలనాయుడు గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదు. అలాగే నెల్లిమర్లలో పలు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో వైసీపీకి యాంటీ కనిపిస్తుంది. ఇదే సమయంలో పతివాడకు వయసు మీద పడటంతో సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో టిడిపి ఇంచార్జ్ కోసం పలువురు నేతలు పోటీ పడ్డారు. చివరికి బంగార్రాజుకు ఇంచార్జ్ పదవి దక్కింది. నియోజకవర్గంపై ఈయనకు గట్టి పట్టు ఉంది. నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఇప్పటికే నెల్లిమర్లపై పట్టు సాధించారు. ఇక సీటు కూడా దాదాపు ఈయనకే ఫిక్స్.
ఈ సారి వైసీపీకి బంగార్రాజు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే నెల్లిమర్లలో జనసేనకు 10-15 వేల ఓట్లు ఉంటాయి. ఇవి కూడా ముఖ్యమే. జనసేనతో పొత్తు ఉంటే నెల్లిమర్లలో టిడిపి జెండా ఎగరడం ఖాయమే. బంగార్రాజు ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ వస్తుంది.
ReplyReply allForward |