తెలుగుదేశం పార్టీ కంచుకోటలని దక్కించుకోవాలని జగన్ ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి కోటలపై ఫోకస్ పెట్టారు. అక్కడ అధికార బలంతో వైసీపీ బలం పెంచుకునే దిశగా రాజకీయం నడిపారు. అలా పలు స్థానాల్లో పట్టు సాధించాలని చూశారు గాని..ఎక్కడ కూడా వైసీపీకి పట్టు దొరకలేదు. ఇదే క్రమంలో కుప్పంపై కూడా గట్టిగా ఫోకస్ పెట్టారు.
అక్కడ చంద్రబాబుని ఓడించడానికి రకరకాల వ్యూహాలు వేశారు. కానీ ఏది కూడా వర్కౌట్ కావడం లేదు. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే భరత్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే అక్కడ బాబు…సిఎం చేసిన వ్యక్తి..మళ్ళీ గెలిస్తే సిఎం అవుతారు. అలాంటప్పుడు కుప్పం ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపడం వేస్ట్. ఇక కుప్పంలో అలా ప్లాన్ చేసి ఫెయిల్ అవుతూ వస్తున్న జగన్..ఇప్పుడు బాలయ్యపై ఫోకస్ పెట్టారు. టిడిపి అడ్డా అయిన హిందూపురంని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. అక్కడ కొత్త అభ్యర్ధిని తీసుకొచ్చారు.
మామూలుగానే హిందూపురం టిడిపి కంచుకోట..అక్కడ ఒక్క సారి కూడా ఓడిపోలేదు. గత రెండు ఎన్నికల్లో అక్కడ బాలయ్య గెలుస్తున్నారు. రెండుసార్లు అభ్యర్ధులని మార్చారు. అయితే హిందూపురంలో బీసీ, ముస్లిం ఓట్లు ఎక్కువ. బీసీలు 90 వేల వరకు ఉంటే, ముస్లింలు 60 వేల వరకు ఉంటారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ముస్లిం అభ్యర్ధి ఇక్బాల్ ని పెట్టారు. అయినా అక్కడ ముస్లింలు బాలయ్య వైపే నిలబడ్డారు. అందుకే మళ్ళీ గెలిచారు.
ఇప్పుడు జగన్..బీసీ మహిళ అయిన దీపికని హిందూపురం బరిలో పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే ఎంతమందిని మార్చిన అక్కడ బాలయ్యకు చెక్ పెట్టడం కష్టమే. అధికారంలో లేకపోయిన అండగా ఉండే బాలయ్యని అక్కడ ప్రజలు వదులుకోరు.