గత ఎన్నికల్లో సంచలన ఓటములు ఎదురైన స్థానాల్లో అనంతపురం పార్లమెంట్ కూడా ఒకటి. అసలు ఓటములు ఎరగని జేసి దివాకర్ రెడ్డి ఫ్యామిలీ తొలిసారి ఓడిపోయింది. జేసి వారసులు తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాడిపత్రిలో జేసి అస్మిత్ రెడ్డి, అనంత ఎంపీగా జేసి పవన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ సారి ఎన్నికల్లో తాడిపత్రి నుంచి పోటీ చేస్తే గెలవడం ఖాయం.
ఆ సీటు పక్కన పెడితే..అనంత ఎంపీగా జేసి పవన్ మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్నారు. మరి ఈ సారి అక్కడ పవన్ గెలుస్తారా? అక్కడ పరిస్తితులు ఎలా ఉన్నాయి? అనే అంశం ఒక్కసారి పరిశీలిస్తే..గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో తలారి రంగయ్య దాదాపు లక్షా 41 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఎంపీగా ఈ నాలుగేళ్లలో సాధించింది ఏమి లేదు. పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి పెద్దగా లేదు. అలాగే లోక్సభలో అనంత సమస్యలే కాదు..రాష్ట్ర సమస్యలపై గళం విప్పిన సందర్భాలు లేవు.
ఇక విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన ఎంపీ అనే సంగతి వైసీపీ శ్రేణులకే సరిగ్గా తెలియదు. అంటే ఆయన పరిస్తితి అలా ఉంది. మళ్ళీ ఆయన పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ లేదు. ఇటు టిడిపి నుంచి పవన్కు పాజిటివ్ ఉంది. కేంద్రంలో ఈయనకు పరిచయాలు ఎక్కువ. పనులు చేయగలరు.
అదే సమయంలో అనంత పరిధిలో టిడిపి బలపడుతుంది. పార్లమెంట్ పరిధిలో ఉరవకొండ, గుంతకల్, శింగనమల, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంత అర్బన్ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం తాడిపత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం సీట్లలో టిడిపికి ఆధిక్యం ఉంది. గుంతకల్, శింగనమలలో వైసీపీకి లీడ్ ఉంది. రాయదుర్గం, అర్బన్ సీట్లలో పోటాపోటి ఉంది. స్వల్ప లీడ్ టిడిపికే ఉంది. అలాగే పవన్ ఎంపీగా ఉంటే క్రాస్ ఓట్లు కూడా పడే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈసారి పవన్ ఎంపీగా గెలిచే ఛాన్స్ ఉంది.