రాజకీయాల్లో అదృష్టం అనేది ఎక్కువ కాలం ఉండదు. ప్రజా మద్ధతు లేకుండా అదృష్టం గెలవాలనుకుంటే అదే జరిగే పని కాదు. ఒకసారి అదృష్టం కొద్ది గెలిస్తే..ఆ గెలుపుని నిలుపుకోవాలి..ప్రజల కోసం పనిచేయాలి..అప్పుడు ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు. అలా కాకుండా అధికారం చెలాయిస్తే గెలుపు రాదు. ఇప్పుడు గోదావరి జిల్లాల మంత్రుల పనితీరు కూడా అలాగే ఉంది.
గత ఎన్నికల్లో జగన్ గాలి, జనసేన ఓట్లు చీల్చడం వల్ల గెలిచి..మంత్రులుగా ఛాన్స్ కొట్టేసిన వారు..ఇప్పుడు ప్రజా వ్యతిరేకతని ఎదుర్కుంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో మంత్రులుగా దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల్, పినిపే విశ్వరూప్ ఉన్నారు. పశ్చిమలో కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత మంత్రులుగా ఉన్నారు. ఇందులో రాజా తప్ప..మిగతా వారంతా బై లక్ గెలిచిన వారే. వైసీపీ వేవ్, జనసేన ఓట్లు చీలికతో రామచంద్రాపురంలో వేణు, అమలాపురంలో విశ్వరూప్, తాడేపల్లిగూడెంలో కొట్టు, తణుకులో కారుమూరి, కొవ్వూరులో వనిత గెలిచారు.
అలాగే మంత్రులుగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రులుగా వారు చేసేది ఏమైనా ఉందా? అంటే జగన్కు భజన చేయడం, చంద్రబాబు, పవన్లని తిట్టడం చేస్తున్నారు. ఇక వీరిలో కొందరు మంత్రులనే సంగతి చాలామందికి తెలియదు. అలాగే ఏ శాఖ మంత్రులు కూడా తెలియదు. వారి శాఖ పరంగా ఏం చేస్తున్నారో తెలియదు.
మంత్రి అంటే మంత్రి అన్నట్లు ఉన్నారు. ఇలా ప్రజల కోసం పనిచేయకపోవడం వల్ల వీరిపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది. అదే సమయంలో ఈ సారి టిడిపి-జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నాయి. దీంతో ఈ మంత్రులకు గెలిచే లక్ ఉండేలా లేదు.
అటు తునిలో గెలిచిన మంత్రి దాడిశెట్టి రాజాకు ప్లస్ ఏమి కనిపించడం లేదు. అక్కడ టిడిపి ఇంకా బలపడితే రాజాకు కూడా చెక్ పడుతుంది.
ReplyReply allForward |