టీడీపీ అధినేత చంద్రబాబు ఆ మధ్య కొన్ని మాటలు చెప్పేవారు..తాను సినిమా హీరో కాదని, అలా అని అధికారంలో లేనని, పైగా తనని చూడని, వారు తెలియని వారు లేరు..40 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. అయినా సరే ప్రజల్లోకి వస్తే ఇంత ఆదరణ ఏంటి? ప్రతి సభలోనూ భారీగా జనం రావడంపై బాబు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ స్పందించిన తీరు ఇది. నిజమే బాబు సినిమా హీరో కాదు..అధికారంలో కూడా లేరు..పైగా 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు. ఆయన్ని అంతా చూసే ఉంటారు.
మరి అయినా భారీగా జనం వస్తున్నారు..రోడ్ షోలు కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. రోడ్డు కూడళ్లలో జరిగే సభలకు భారీగా జనం వస్తున్నారు. అది రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా..కోస్తా అయినా ప్రజాదరణ భారీగా ఉంది. తాజాగా బాబు కోనసీమలో పర్యటిస్తున్నారు. మండపేటలో రైతు రచ్చబండ, రోడ్ షో, సభ నిర్వహించారు. దీనికి భారీగా జనం వచ్చారు. దీని బట్టి చూస్తే బాబుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని అర్ధమవుతుంది.
పైగా అధికారంలో ఉన్న జగన్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందో…లాభం జరుగుతుందో బాబు సభలకు వస్తున్న జనం బట్టి అర్ధమైపోతుంది. ఒకవేళ జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, మేలు పొందుతున్నారని అనుకుంటే..బాబు సభలకు జనం పెద్దగా రావాల్సిన అవసరం ఉండదు. ఏదో టిడిపి కార్యకర్తల వరకు వస్తారు. వారికి ఆసక్తి లేకపోతే రావడం కష్టం.
ఇటు టిడిపి శ్రేణులతో పాటు, అటు సాధారణ ప్రజలు సైతం బాబు సభల్లో కనిపిస్తున్నారు. రోడ్ షో జరుగుతుంటే..దారి పొడవుల ప్రజలు కనిపిస్తూ చేతులు ఊపుతున్నారు. యువత బాబు కాన్వాయ్ వెనుక పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్తితులని చూస్తుంటే మళ్ళీ ప్రజలు బాబుని సిఎంగా చూడాలని అనుకుంటున్నారని అర్ధమవుతుంది. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుంటుందని ఆశపడుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి బాబు గెలిపించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు.