మొదటిసారి పోటీ..పైగా వైసీపీ గాలి..దీంతో పరిటాల వారసుడు శ్రీరామ్కు తొలి ఓటమి ఎదురైంది. అసలు పరిటాల ఫ్యామిలీ ఓటమి ఎరగని ఫ్యామిలీ. దివంగత పరిటాల రవీంద్ర, సునీతమ్మ వరుసగా విజయాలు సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక ఫ్యామిలీకి ఒకటే సీటు అన్నారు. దీంతో సునీతమ్మ బరిలో నుంచి తప్పుకుని, శ్రీరామ్ని రాప్తాడు బరిలో నిలబెట్టారు.
అప్పటికే ఓటములు చవిచూసిన వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై సానుభూతి, ఇటు వైసీపీ గాలి, టిడిపిపై వ్యతిరేకత..ఈ అంశాలు శ్రీరామ్ ఓటమికి కారణమయ్యాయి. ఇప్పుడు శ్రీరామ్ రెండోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు. కాకపోతే ఈ సారి ధర్మవరం బరిలో దిగాలని చూస్తున్నారు. ఇటు సునీతమ్మ రాప్తాడు బరిలో పోటీ చేయనున్నారు. శ్రీరామ్ ధర్మవరం పై ఫోకస్ పెట్టారు. కానీ అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక ప్రతి రోజూ ఆయన ప్రజల్లో తిరిగే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో కేతిరెడ్డికి ప్రజా మద్ధతు ఎక్కువ ఉంది.
అయితే శ్రీరామ్ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ధర్మవరంలో టిడిపి బలంగా ఉంది. అదే సమయంలో కేతిరెడ్డి కేవలం కెమెరాలు, మైకులు పెట్టుకుని ప్రజల్లోకి వెళుతూ వీడియోలు చేస్తున్నారని, అదంతా స్క్రిప్ట్ అని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాలని ప్రజలు కూడా గమనిస్తున్నారు. దీంతో కేతిరెడ్డికి ఇటీవల పాజిటివ్ తగ్గుతుంది. ఇటు శ్రీరామ్ బలం పెరుగుతుంది.
ప్రస్తుతానికి నువ్వా-నేనా అన్నట్లు ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది. ఈ లోపు కేతిరెడ్డిపై ఇంకా యాంటీ పెరగడం, శ్రీరామ్ బలం పెరిగితే..ధర్మవరంలో గెలుపు సులువే. ఇక ఇక్కడ జనసేనకు 10 వేల ఓటింగ్ వరకు ఉంది. పొత్తు ఉంటే శ్రీరామ్కు ప్లస్. చూడాలి మరి శ్రీరామ్ సెకండ్ ఛాన్స్ లో సత్తా చాటుతారేమో.