ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో అనేక ట్విస్ట్లు వస్తున్నాయి..అన్నీ పార్టీల్లోనూ అభ్యర్ధుల విషయంలో క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన పనితీరు ఏమి బాగోలేదు. సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకించే పరిస్తితి. ఆయనకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేకు సీటు విషయంలో ఇబ్బంది ఉంది. సీటు వస్తుందో లేదో గ్యారెంటీ లేదు.
అదే సమయంలో టిడిపిలో కుడ కన్ఫ్యూజన్ ఉంది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి వెళ్లారు. దీంతో ఇక్కడ టిడిపి అభ్యర్ధి ఎవరో క్లారిటీ లేదు. పలువురు నేతలు పోటీ పడుతున్నారు. కానీ సీటు ఎవరికి ఇస్తారో తెలియదు. అటు జనసేనలో కుడ కన్ఫ్యూజన్ ఉంది. అయితే పొత్తు ఉంటే ఇక్కడ సమీకరణాలు మారిపోతాయి. పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు వదులుతారనే ప్రచారం ఉంది.
అందుకే జయమంగళ సైతం టిడిపిని వదిలేసి వైసీపీలోకి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకున్నారని తెలిసింది. ఇక జనసేనకు సీటు ఇస్తే బలమైన అభ్యర్ధి కావాలి..జనసేనలో ఆ స్థాయిలో బలమైన నాయకులు తక్కువ. ఇదే సమయంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు తెరపైకి వస్తుంది. ఈయన బిజేపిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపితో పొత్తులో భాగంగా కైకలూరు బరిలో బిజేపి నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కూడా అయ్యారు. తర్వాత పొత్తు చెడిపోవడంతో 2019 ఎన్నికల్లో ఈయన పోటీకి దిగలేరు.
బిజేపిలోనే కంటిన్యూ అవుతున్నారు.ఒకవేళ టిడిపి, జనసేనలతో బిజేపి పొత్తు ఉంటే కైకలూరులో కామినేని పోటీ చేయవచ్చు. అలా కానీ పక్షంలో జనసేనకు సీటు వస్తే..ఆ పార్టీలోకి వచ్చి కామినేని పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. పొత్తు ఉంటే..కామినేని బరిలో ఉంటే కైకలూరులో గెలిచేసే ఛాన్స్ ఉంది.