తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం పట్టు లేని స్థానాల్లో కురుపాం ఒకటి. గిరిజన ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ఈ స్థానంలో టిడిపి ఇంతవరకు గెలవలేదు. వరుసగా ఓడిపోతూ వస్తుంది. ఇక్కడ వైసీపీ పై చేయి సాధిస్తూ వస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పుష్పశ్రీ వాణి గెలిచారు. మొన్నటివరకు జగన్ కేబినెట్ లో డిప్యూటీ సిఎంగా పనిచేశారు. గిరిజన శాఖ మంత్రిగా చేశారు.
గిరిజన శాఖ మంత్రిగా చేసిన గిరిజనులకు ఒరిగింది ఏమి లేదు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. కురుపాంలో అభివృద్ధి శూన్యం. పైగా పుష్పశ్రీ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. దీంతో పుష్పశ్రీకి నెగిటివ్ ఉంది. ఇదే సమయంలో టిడిపిలో సరైన అభ్యర్ధి లేకపోవడం మైనస్ గా మారింది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనార్ధన్ ధాట్రాజ్ అనారోగ్యంతో మరణించారు. ఈయన సీనియర్ నేత శతృచర్ల విజయరామరాజు మేనల్లుడు.
ఇక కురుపాంలో పార్టీ బాధ్యతలని శతృచర్ల చూసుకుంటున్నారు. శతృచర్ల సోదరుడు చంద్రశేఖర్ రాజు..పుష్పశ్రీకి మామ. ఆయన ఆ మధ్య టిడిపిలోకి వచ్చారు. ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆయన కుమార్తె పల్లవి రాజు టిడిపిలో యాక్టివ్ అయ్యారు. ఈమె పుష్పశ్రీకి ఆడపడచు. నెక్స్ట్ ఎన్నికల్లో కురుపాం సీటు ఆశిస్తున్నారు.
ఇప్పటికే యాక్టివ్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు సీటు మాత్రం ఎవరికి ఫిక్స్ చేయలేదు. దీంతో కాస్త సీటు విషయంలో క్లారిటీ రాలేదు. త్వరగా అభ్యర్ధిని ఫిక్స్ చేస్తే కురుపాంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం ఓడిపోతూ వస్తున్న సీటుని కైవసం చేసుకోవచ్చు