ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టిడిపి, వైసీపీలు తమ అభ్యర్ధులని రెడీ చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కంటే ఇప్పుడే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే నెల్లూరు రూరల్ లో అటు టిడిపి, ఇటు వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. వైసీపీ నుంచి టిడిపి వైపుకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు అభ్యర్ధిగా ఫిక్స్ చేశారు.
ఇక టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్ళి ఎంపీగా గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ వైసీపీ అభ్యర్ధిగా జగన్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు వీరి మధ్య హోరాహోరీ మొదలైంది. ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారనే అంశం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ సీటులో గెలుపోటములపై బెట్టింగులు కూడా నడిసిపోతున్నాయని టాక్. అలాంటి హాట్ సీటులో ఎవరిది పై చేయి అనే అంశంపై సర్వేలు జరుగుతున్నాయి. అయితే ఒకసారి అభ్యర్ధుల బలాబలాలని చూస్తే..కోటంరెడ్డి..పార్టీలతో సంబంధం లేకుండా రూరల్ లో ఆయనకు ప్రజా బలం ఉంది.
2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కష్టపడుతూనే ఉంటారు. అందుకే ప్రజల మద్ధతు ఉంటుంది. ఇక ఇక్కడ టిడిపి బలపడటం, కోటంరెడ్డి ఆర్ధికంగా కూడా బలంగా ఉండటం కలిసొచ్చే అంశం. పైగా ప్రభుత్వ వ్యతిరేకత కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
ఇటు ఆదాల గురించి చూస్తే..ఈయన ఇప్పటికే పలు పార్టీలు మారారు. వాస్తవానికి 2019లో నెల్లూరు రూరల్ టిడిపి అభ్యర్ధి ఈయనే..ప్రచారం కూడా చేశారు. చివరి నిమిషంలో వైసీపీలోకి వెళ్ళి నెల్లూరు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు వైసీపీ నుంచి రూరల్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. అధికార బలం, పథకాలు, ఆర్ధిక బలం ఆదాలకు ప్లస్. మొత్తానికి చూస్తే ఇద్దరు సమానంగానే ఉన్నారు. కానీ ప్రజల్లో ఎక్కువ ఉండే కోటంరెడ్డికే మొగ్గు ఎక్కువ కనిపిస్తుంది.