వైసీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో అక్కడ టిడిపికి ఒక్క సీటు కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా బలపడింది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత,. టిడిపి నేతలు బాపపడటం, నారా లోకేష్ పాదయాత్ర టిడిపికి కలిసొస్తుంది. దీంతో సగం సీట్లలో టిడిపికి ఆధిక్యం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆలూరు సీటులో సైతం టిడిపికి ఆధిక్యం కనిపిస్తుంది. ఇక్కడ టిడిపి గెలిచి చాలా ఏళ్ళు అయింది.
గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం గెలిచారు..ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు. ఇక మంత్రిగా ఉన్న జయరాం..నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పెద్దగా లేదు. పైగా ఇసుకలో అక్రమాలు, పేకాట క్లబ్బులు పెట్టడం, బెంజ్ కారు లంచం, భూ కబ్జాలు లాంటి ఆరోపణలు మంత్రి చుట్టూ ఉన్నాయి. ఈ పరిణామాలు మంత్రికి పెద్ద మైనస్ అయ్యాయి. ఇదే క్రమంలో టిడిపి నాయకురాలు కోట్ల సుజాతమ్మ బలపడ్డారు.
గత ఎన్నికల్లో ఓటమికి ఆమె రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఇక్కడ స్కెచ్ మార్చింది..ఈ సారి జయరాంకు ఆలూరు సీటు ఇవ్వకుండా..ఎంపీగా పంపే ఛాన్స్ ఉందని తెలిసింది. ఇక ఆలూరులో తాజాగా టిడిపిలో చేరిన కప్పట్రాళ్ళ బొజ్జమ్మని బరిలో నిలబెట్టే ఛాన్స్ ఉంది. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కుమార్తె కప్పట్రాళ్ల బొజ్జమ్మ టిడిపిలో జెడ్పిటిసి గా పనిచేశారు. ఆ ఫ్యామిలీ ఎన్నో ఏళ్ళు టిడిపిలో పనిచేసింది.
కాకపోతే ఆలూరు సీటు దక్కదని తెలిసి వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో బొజ్జమ్మకు సీటు ఇస్తారని ప్రచారం ఉంది. దీంతో కోట్ల వర్సెస్ కప్పట్రాళ్ళ మధ్య పోరు జరగనుంది. అయితే జయరాంకు సీటు ఇవ్వకపోతే..ఆయన ఎంతవరకు వైసీపీకి సహకరిస్తారనేది చూడాలి. ఏదేమైనా ఈ సారి ఆలూరులో టిడిపి పైచేయి సాధించేలా ఉంది.