రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎన్ని రకాలుగా అధికార బలాన్ని వాడి మళ్ళీ గెలవాలని చూసిన సరే..ప్రజలు ఈ సారి గట్టిగానే షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ప్రజలకు బాగా తెలుసు. కాకపోతే వారు ఇప్పుడే బయటపడటం లేదు. ఇంకా వైసీపీకే మద్ధతు అన్నట్లు కనబడుతున్నారు. కానీ అంతర్గతంగా వారు టిడిపి వైపుకు వచ్చారు. దీంతో చాలా చోట్ల వైసీపీ గ్రాఫ్ డౌన్ అయ్యి..టిడిపి హవా పెరుగుతుంది.
ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో కూడా టిడిపి అనూహ్యంగా పుంజుకుంది..అది కూడా పొత్తులతో సంబంధం లేకుండా టిడిపి లీడ్ లో ఉందని తాజా సర్వేల్లో తేలింది. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో 7 సీట్లు ఉన్నాయి. మచిలీపట్నం, పామర్రు, గుడివాడ,గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ, పెడన సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క గన్నవరం తప్ప మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. తర్వాత గన్నవరం ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్లారు. దీంతో మొత్తం వైసీపీ ఖాతాలో ఉన్నాయి.
అయితే ఇన్ని సీట్లు ఇచ్చిన సరే కృష్ణాకు వైసీపీ చేసిందేమి లేదు. అభివృద్ధి శూన్యం. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలో తాజా సర్వే ప్రకారం..టిడిపి 4, వైసీపీ 2 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని తేలింది. ఒక గన్నవరంలో టఫ్ ఫైట్ ఉంటుందని తెలుస్తుంది. టిడిపి..మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పెనమలూరు సీట్లలో గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ నాలుగు సీట్లలో జనసేన ప్రభావం ఉంది..ఆ పార్టీ కలిస్తే ఇంకా ఆధిక్యం పెరుగుతుంది.
ఇక వైసీపీ..గుడివాడ, పామర్రు సీట్లలో గెలుస్తుందని తెలిసింది. అయితే పొత్తు ఉంటే జనసేనకు ఏ సీట్లు వదులుతారనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికైతే కృష్ణాలో ఈ సారి టిడిపి హవా ఉంటుంది.