అసెంబ్లీ సీట్లలో గెలుపు ఎంత ముఖ్యమో..అలాగే పార్లమెంట్ సీట్లలో కూడా టిడిపి, వైసీపీలకు గెలుపు అంత ముఖ్యం. పార్లమెంట్ పరిధిలో బలమైన అభ్యర్ధులు ఉంటే..ఆ ప్రభావం 7 అసెంబ్లీ స్థానాలపై ఉంటుంది. అలాగే కేంద్రంలో చక్రం తిప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎంపీ సీట్లు కూడా కీలకం. రెండు పార్టీలు ఎంపీ సీట్లని ఎక్కువ గెలుచుకోవడానికి గట్టిగానే పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఏలూరు ఎంపీ సీటులో గట్టి పోటీ నెలకొంది.
ఇక ఏలూరులో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది..దీంతో ఆ సీటుపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్ గెలిచారు. టిడిపి నుంచి మాగంటి బాబు పోటీ చేసి ఓడిపోయారు. మరి ఈ సారి కూడా ఈ ఇద్దరే పోటీ చేస్తారా ? అంటే కష్టమనే చెప్పాలి. ఎంపీ శ్రీధర్ పై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో ఈ సారి ఆయనకు సీటు డౌటే అంటున్నారు. ఆయన్ని అసెంబ్లీకి పంపే ఆలోచన చేయవచ్చు.
ఇక పార్లమెంట్ లో బలమైన నేతని బరిలో దింపుతారని తెలుస్తుంది. ఇటు టిడిపిలో మాగంటి బాబు ఉన్నారు..ఆయనకు వయసు మీద పడింది..కానీ పార్టీలో ఇంకా పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు ఈయనకే సీటు ఇస్తారా?లేదా? వేరే నేతని పెడతారా? అనేది చూడాలి. నూజివీడుకు చెందిన ఓ కమ్మ నేత ఏలూరు ఎంపీ సీటు ఆశిస్తున్నారని తెలుస్తుంది.
అటు బిజేపిలో తపన ఫౌండేషన్ ఛైర్మన్ తపన చౌదరీ ఉన్నారు..ఈయన బిజేపి-జనసేన పొత్తులో పోటీ చేయాలని చూస్తున్నారు. టిడిపితో పొత్తు ఉంటే..ఆ పార్టీ వైపుకు రావచ్చు. మొత్తానికైతే రెండు పార్టీల్లో ఏలూరు ఎంపీ అభ్యర్ధిపై క్లారిటీ లేదు.