ఓ వైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్…వైసీపీని గద్దె దింపి..టిడిపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. మొన్నటివరకు చంద్రబాబు కష్టంతో టిడిపి నడిచేది. ఇప్పుడు బాబుకు లోకేష్ తోడు అయ్యారు. పాదయాత్ర చేస్తూ ప్రజా మద్ధతు కూడబెడుతున్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసిన లోకేష్..ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. పల్నాడు ప్రాంతంలో పాదయాత్ర మొదలుపెట్టారు.
తాజాగా వినుకొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ఎంట్రీ ఇచ్చింది. అయితే రోజురోజుకూ లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతుంది. ఇటీవల అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో భారీగా జానా సందోహం కనిపించింది. దర్శిలో టిడిపికి ఇంచార్జ్ కూడా లేరు. కానీ అక్కడ భారీగా జనం వచ్చారు. అంటే టిడిపి పట్ల ప్రజలు సానుభూతితో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు పల్నాడులో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వడంతో వైసీపీలో టెన్షన్ నెలకొంది.
లోకేష్ పాదయాత్రతో వైసీపీకి చెక్ పెడుతుంటే..అటు చంద్రబాబు ఇటీవలే నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు పూర్తి చేసుకుని సాగునీటి ప్రాజెక్టుల బాటపట్టారు. ప్రాజెక్టులని జగన్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే అక్కడే భారీ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా నందికొట్కూరులో భారీ సభ నిర్వహించి…అక్కడే ఉన్న ముచ్చుమర్రి, బనకచర్ల ప్రాజెక్టులని పరిశీలించారు.
ఇప్పుడు కడపలోని జగన్ కోట పులివెందులలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఇటు గండికోట ప్రాజెక్టుని పరిశీలిస్తారు. ఇలా రాష్ట్రం మొత్తం పర్యటిస్తారు. ఈ విధంగా బాబు, లోకేష్ వైసీపీకి చెక్ పెట్టేలా ముందుకెళుతున్నారు.