రాష్ట్రం విడిపోయాక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఒప్పుకున్నారు. అయితే అయిదేళ్లలోనే సాధ్యమైన మేర రాజధాని నిర్మాణాలు చేపట్టారు. కానీ దానిపై కుల ముద్రవేసి 2019 ఎన్నికల్లో జగన్ లబ్ది పొందారు. ఆఖరికి అమరావతి ప్రజలు సైతం బాబుని నమ్మలేదు. వైసీపీని గెలిపించారు. కానీ గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని ఏ విధంగా నాశనం చేశారో చెప్పాల్సిన పని లేదు. మూడు రాజధానులు అని చెప్పి..చివరికి రాజధాని లేకుండా చేశారు.
అప్పటినుంచి అమరావతి ప్రజలు, రైతులు ఉద్యామిస్తూనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన వెనక్కి తగ్గడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో తమ బలం ఏంటో చూపించాలని భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో టిడిపి అధికారంలోకి వచ్చి అమరావతిని మళ్ళీ అభివృధ్ది చేయాలని చూస్తుంది. అదే అంశాన్ని తాజాగా లోకేష్ తన పాదయాత్రలో పేర్కొన్నారు. అమరావతిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..అమరావతి రైతులతో సమావేశమయ్యారు. జగన్ పాలనలో రైతులు ఎదురుకున్న ఇబ్బందులు, అవమానాలు, దాడుల తీరుని తెలుసుకున్నారు.
అన్నీ రకాలుగా రైతులకు అండగా ఉంటామని, అమరావతిని రాజధానిగా చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇక లోకేష్ పాదయాత్రకు అమరావతిలో పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తుంది. తాడికొండ నియోజకవర్గంలో భారీ మద్ధతు దక్కింది. నెక్స్ట్ ఆయన మంగళగిరిలో పర్యటిస్తారు. గత ఎన్నికల్లో ఇక్కడే లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు.
ఇక ఈ సారి మంగళగిరిలో గెలుపే దిశగా లోకేష్ ముందుకెళుతున్నారు. అయితే ఈ సారి మంగళగిరిలో గెలుపోటముల గురించి చర్చ లేదు..కేవలం లోకేష్కు ఎంత మెజారిటీ వస్తుందనేది లెక్కపై చర్చ ఉంది. చూడాలి మంగళగిరిలో లోకేష్ ఎంత మెజారిటీతో గెలుస్తారో.