రాజధాని పేరుతో విశాఖని వైసీపీ నాశనం చేస్తుందని, అక్కడ భూ కబ్జాలు పెరిగాయని, కొండలు తవ్వేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణల్లో నిజం ఎంత ఉందనేది ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే వైసీపీ పరిపాలన రాజధాని పేరుతో విశాఖలో ఏం చేస్తుందో బాగా క్లారిటీ ఉంది. అందుకే అక్కడ వైసీపీకి ప్రజా మద్ధతు తగ్గుతుందే తప్ప పెరగడంలేదు.
గత ఎన్నికల్లో విశాఖ ప్రజలు వైసీపీకే మద్ధతు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ 11 సీట్లు గెల్చుకుంది. టిడిపి 4 సీట్లు గెల్చింది. ఇలా విశాఖపై వైసీపీ పట్టు సాధించింది. అధికారంలోకి వచ్చాక అమరావతిని దెబ్బతీయాలని చెప్పి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకున్నారు. అందులో విశాఖని పరిపాలన రాజధాని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి ఇంతవరకు ఒక్క రాజధానికి దిక్కు లేదు. అయితే త్వరలోనే జగన్ విశాఖలో కాపురం పెడతానని అంటున్నారు..విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని చెబుతున్నారు. ఒకవేళ ఇలా చేస్తే విశాఖ ప్రజలు వైసీపీకి మద్ధతు ఇస్తారా? అంటే అది జరగని పని అనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఎందుకంటే విశాఖ రాజధాని పేరుతో వైసీపీ ఏం చేస్తుందో ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఈ సారి విశాఖ ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపడం కష్టమే అని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇక్కడ టిడిపికి ఆధిక్యం కనిపిస్తోంది. అలాగే జనసేనతో పొత్తు ఉంటే మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
అరకు, పాడేరు, మాడుగుల లాంటి సీట్లు మినహా మిగిలిన సీట్లలో టిడిపి-జనసేన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఎటు చూసుకున్న 10-12 సీట్లు టిడిపి-జనసేన గెలుచుకుంటాయని అంచనా వేస్తున్నారు. అంటే రాజధాని అని చెప్పిన వైసీపీని విశాఖ ప్రజలు నమ్మేలా లేరు.