కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ దెబ్బలు తగిలేలా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో వైసీపీకి డ్యామేజ్ ఎక్కువ ఉంది. ఆ డ్యామేజ్ని పెంచేలా లోకేష్ పాదయాత్ర సాగుతుంది..ఆనం రామ్ నారాయణ రెడ్డి రాజకీయం కొనసాగుతుంది. ఈ సారి జిల్లాలో పట్టు సాధించే దిశగా టిడిపి వెళుతుంది. వాస్తవానికి నెల్లూరు వైసీపీ కంచుకోట..2014లో జిల్లాలో 10 సీట్లకు వైసీపీ 7, టిడిపి 3 సీట్లు గెలుచుకుంది.
ఇటు 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇలా వైసీపీని ఆదరిస్తున్న నెల్లూరు ప్రజలకు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒరిగింది ఏమి లేదు. అందరితో పాటే పథకాలు వస్తున్నాయి. అభివృద్ధి పెద్దగా లేదు. కొత్త కంపెనీలు రావడం లేదు. అటు వైసీపీ నేతల అక్రమాలు, దోపిడి పెరిగిపోయిందనే విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద మైనస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు అది కూడా రెడ్డి ఎమ్మెల్యేలు వైసీపీని వదిలి టిడిపి వైపుకు వచ్చారు. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి వైపుకు వచ్చారు. దీంతో వైసీపీకి ఇంకా నష్టం పెరిగింది.
ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర నెల్లూరులో విజయవంతంగా సాగుతుంది. ఈ సారి 10కి 10 సీట్లు టిడిపికి ఇస్తే నెల్లూరుని అభివృద్ధిలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని అంటున్నారు. ఇటు ఆనం ఏమో తనకు పట్టున్న ఆత్మకూరు, వెంకటగిరి, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో టిడిపిని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఈ పరిణామాలతో ఈ సారి నెల్లూరులో వైసీపీకి భారీ డ్యామేజ్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.