175కి 175 సీట్లు గెలవడమే తమ లక్ష్యమని జగన్ చెబుతున్నారు..కానీ దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్ లో వైసీపీకి పట్టు లేకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. దాదాపు సగానికి సగం ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉండటం పెద్ద మైనస్ ఉంది. పోనీ వారందరికి సీట్లు ఇవ్వకూన ఉండాలంటే అది పెద్ద కష్టమే. ఏదో కొంతమందిని పక్కన పెట్టగలరు గాని..అంతమందిని పక్కన పెట్టలేరు. ఇంకా పెద్ద మైనస్ ఏంటంటే..పనితీరు బాగోని వారిలో మంత్రులు కూడా ఉండటం..మామూలుగా మంత్రులు పూర్తిగా డమ్మీ అన్నట్లు ఉంది.
జగన్ కేబినెట్ లో సగం పైనే మంత్రులు..మంత్రి స్థానంలో విఫలమయ్యారు. ఇక కొందరు మంత్రులు అనే సంగతి ప్రజలకు తెలియకపోవడం పెద్ద విశేషం. ఇదిలా ఉంటే కొందరు మంత్రులు..తమ నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులుగా కూడా ఫెయిల్ అయ్యారట. తమ స్థానాల్లో దారుణంగా విఫలమయ్యారని తెలిసింది. దీంతో వారికి మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమనే పరిస్తితి. అలా గెలిచే అవకాశాలు లేని మంత్రులకు జగన్ సీటు ఇవ్వకపోవడం కూడా పెద్ద ఇబ్బందే. అది పార్టీకే నష్టం చేకూరుస్తుంది.
అందుకే కొందరు మంత్రులని ఈ సారి వేరే సీటుకు పంపడం లేదా ఎంపీలుగా పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం చూసుకుంటే..గుమ్మనూరు జయరాం, పినిపే విశ్వరూప్ లాంటి వారిని ఎంపీలుగా పంపుతారని తెలిసింది. జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు లాంటి వారి సీట్లు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చూడాలి మరి చివరికి జగన్ ఎంతమంది మంత్రుల సీట్లు మారుస్తారో. వారు మళ్ళీ ఏ మేరకు గెలవగలుగుతారో.