ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ సారి వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేస్తా..ఇదే నా ఛాలెంజ్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజోలు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగో వైసీపీని ఈ సారి ఖచ్చితంగా గద్దె దించడం ఖాయమని, ఇక గోదావరి జిల్లాలపై రెడ్ల పెత్తనం తెచ్చి..నాశనం చేశారని, అసలు ఇక్కడ ఒక్క సీటు కూడా వైసీపీకి రానివ్వకుండా చేస్తానని పవన్ సవాల్ చేశారు.
మరి ఈ సవాల్ని పవన్ గెలుస్తారా? అంటే కొంతమేర గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సవాల్ నెగ్గే ఛాన్స్ ఉంది..కానీ తూర్పులో కాస్త కష్టమే..అక్కడ వైసీపీ రెండు, మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తే..గోదావరి జిల్లాల్లో భారీగా సీట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి 2014లో టిడిపికి జనసేన సపోర్ట్ ఇవ్వడం వల్ల..తూర్పులో 19 సీట్లు ఉంటే టిడిపి 13, బిజేపి 1,వైసీపీకి 5 సీట్లు వచ్చాయి. పశ్చిమలో 15 సీట్లు ఉంటే టిడిపి 14, బిజేపి 1 సీటు గెలుచుకుంది. అంటే స్వీప్ జరిగింది.
2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. తూర్పులో వైసీపీ 14, టిడిపి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. పశ్చిమలో వైసీపీ 13, టిడిపి 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే పశ్చిమలో స్వీప్ చేసే ఛాన్స్ ఉంది..లేదంటే వైసీపీకి ఒకటి లేదా రెండు సీట్లు రావచ్చు. తూర్పులో మాత్రం స్వీప్ కష్టమే కానీ..వైసీపీకి మూడు లేదా నాలుగు సీట్లు రావచ్చు. మొత్తానికి టిడిపి, జనసేన కలిస్తే గోదావరి జిల్లాల్లో సత్తా చాటనున్నాయి.