యువగళం పాదయాత్రతో లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే..అన్నీ వర్గాల ప్రజలని కలుసుకుంటూ..జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ముందుకెళుతున్నారు. అలాగే లోకేష్ పాదయాత్రతో టిడిపికి బాగా ప్లస్ అవుతుంది. పార్టీ బలోపేతం అవుతుంది. ఆయన ఇప్పటివరకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించారు. వాటిల్లో ఒక అనంతపురం మినహా..మిగిలిన జిల్లాలు వైసీపీ బలంగా ఉన్న జిల్లాలు..ఆ జిల్లాల్లో ఇప్పుడు టిడిపి చాలా వరకు బలపడిందంటే లోకేష్ పాదయాత్ర కారణమని చెప్పవచ్చు.
ఇప్పుడు లోకేష్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. కందుకూరు నుంచి కొండపి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ప్రతిచోటా ఆయనకు జనం మద్ధతు చాలా ఎక్కువ వస్తుంది. నారా లోకేష్ను చూసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజానీకం పోటీపడుతున్నారు. గ్రామగ్రామానా ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. అధికారపార్టీ నేతలు పెడుతున్న ఇబ్బందులను, ప్రభుత్వపరంగా ఎదురవుతున్న సమస్యలను, వాటిని పరిష్కరించని యంత్రాంగం తీరును లోకేష్కు ప్రజలు వివరిస్తున్నారు.
లోకేష్ సైతం ప్రజలకు అండగా ఉండేలా ముందుకెళుతున్నారు. ఆయన ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక లోకేష్ ప్రకాశంలో..నెక్స్ట్ కనిగిరి, మార్కాపురం, ఎస్ఎన్పాడు, ఒంగోలు, అద్దంకి, దర్శి, వైపాలెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నెక్స్ట్ పల్నాడు ప్రాంతంలోకి అడుగు పెడతారని తెలుస్తుంది. ఇక ప్రకాశంలో లోకేష్ టచ్ చేయని స్థానాలు పర్చూరు, గిద్దలూరు, చీరాల..మిగిలిన అన్నీ నియోజకవర్గాలని కవర్ చేస్తారు. ఇక లోకేష్ పాదయాత్రతో ప్రకాశంలో టిడిపికి భారీ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జిల్లాలో టిడిపి పట్టు సాధిస్తుంది. ఇప్పుడు పాదయాత్ర మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. జిల్లాలో దాదాపు 8 సీట్లు గెలవడమే టార్గెట్ గా ఉంది. ఆ సీట్లని టిడిపి ఈజీగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.